Ayyappa App
డౌన్‌లోడ్ యాప్

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళి (పువ్వులతో పుజిoచాలి)

Ayyappa Swamy

         ఓం రేవందర ఋషి ! గాయత్రిచ్చందః | ఓం రత్నాభం సుప్రసన్నంశశిధర

మకుటం రత్న భూషాభిరామం | శులకేలం కపాలం సరముసల ధనువార్
బాహు సంగేధ దానం మత్తేమారూఢ మాధ్య హరిహర తనయం కోమలాoగo
దయాద్యం విశ్వేశం భక్త వంద్యం నతజన వదనం గ్రామపాలం నమామి |
 
ఓం మహాశాస్త్రే నమః
ఓం శిల్పశాస్త్రే నమః
ఓం లోకశాస్త్రే నమః
ఓం మహాబలాయ నమః
ఓం ధర్మశాస్త్రే నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం కాలశాస్త్రే నమః
ఓం మ       జసే నమః
ఓం గాజాధిపాయ నమః
ఓం అoగపతయే నమః
ఓం వ్యఘ్రపతయే నమః
ఓం మహాద్యుతాయ నమః
ఓం గణాద్యక్షాయ నమః
ఓం మహాగణగుణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః 
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం నక్షత్రాయ నమః
ఓం చంద్రరూపాయ నమః
ఓం వలహకాయ నమః
ఓం దూర్వాయ నమః
ఓం శ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం క్రూర ద్రుష్టయే నమః
ఓం అనామాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారయ నమః
ఓం కాలాoతకాయ నమః
ఓం నరాధిపాయ నమః
ఓం దక్షమూషకాయ నమః
 
ఓం కల్పారకుసుమప్రియాయ నమః
ఓం మదనాయ నమః
ఓం మాధవసుతాయ నమః
ఓం మందార కుసుమ ప్రియాయ నమః
ఓం మదలాసాయ నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం మహాసర్ప విభూషణాయ నమః
ఓం మహాశూరాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాపాపవినశకాయ నమః
ఓం అసిహస్తాయ నమః
ఓం శరధరాయ నమః
ఓం హాలాహాలధరసుతాయ నమః
ఓం అగ్నినయనాయ నమః
ఓం అర్జునపతయే నమః
ఓం అనంగమధునాతురాయ నమః
ఓం దుష్టగ్రహధిపాయ నమః
ఓం శాస్త్రే నమః నమః
ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
ఓం రాజరాజార్చితాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజసోత్తమాయ నమః
ఓం మంజులేశాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహానాయ నమః
ఓం వజ్రంగాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం ఖడ్గపాణయే నమః
ఓం బలోద్యుతాయ నమః
ఓం త్రిలోకజ్ఞానాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం కస్తూరితిలకాంచితాయ నమః
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణ ధవళాయ నమః
ఓం పూర్ణలేశాయ నమః
ఓం కృపాలాయ నమః
ఓం వనజనాధిపాయ నమః
ఓం పాశహస్తాయ నమః
ఓం భయపహాయ నమః
ఓం బకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయా నమః
ఓం పాషాoడరుదిరాశనాయ నమః
ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
ఓం పరపాప వినాశకాయ నమః
ఓం పంచవక్త్ర పరాయణాయ నమః
ఓం పంచాక్షరీ పారాయణాయ నమః
ఓం పండితాయ నమః
ఓం శ్రీధర సుతాయ నమః
ఓం న్యాయాయ నమః
ఓం కవచనే నమః
ఓం కాండయూజషే నమః
ఓం తర్పణ ప్రియాయ నమః
ఓం శ్యామరూపాయ నమః
ఓం నవ్య ధన్యాయ నమః
ఓం సత్సoతాప వినశకాయ నమః
ఓం వ్యాఘ్ర చర్మ ధరాయ నమః
ఓం శూలినేక్రుపాళాయ నమః
ఓం వేణువదనాయ నమః
ఓం కంచుకంఠాయ నమః
ఓం కళారవాయ నమః
ఓం కిరీటాధి విభుషితాయ నమః
ఓం ధూర్జటినే నమః
ఓం వీరనిలయాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీరేంద్ర వందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వీరపతయే నమః
ఓం వివిదార్ధ ఫలప్రదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చథుర్భాహూవే నమః
ఓం పరపాశవిమోచనాయ నమః
ఓం నాగకుండలధరాయ నమః
ఓం కిరీటాయ నమః
ఓం జటటాధదాయ నమః
ఓం నాగాలoకార సంయుక్తాయ నమః
ఓం నానారత్నవిభుషితాయ నమః
 

అయప్ప పూజా కార్యక్రమాలు

Swami Image
పూజ

హరివరాసనం (శ్రీ హరిహరాత్మజాష్టకం)

  హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ | అరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే ||                    '' శరణమయ్యప్ప-1 " శరణకీర్తనం శక్తమానసం భరణలోలుపం నర్తనాలసమ్ | అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే ||                    '' శరణమయ్యప్ప-2 " ప్రణయసత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ | ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే ||                    '' శరణమయ్యప్ప-3 " తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితమ్ | గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే ||                    '' శరణమయ్యప్ప-4 " త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనప్రభుం దివ్యదేశికమ్ | త్రిదశపూజితం చింతితప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే ||                    '' శరణమయ్యప్ప-5 " భవభయాపహం భావుకావహం భువనమోహనం భూతిభూషణమ్ | ధవళవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయే ||                    '' శరణమయ్యప్ప-6 " కలమృదుస్మితం సుందరాననం కలభకోమలం గాత్రమోహనమ్ | కలభకేసరీ-వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే ||                    '' శరణమయ్యప్ప-7 " శ్రితజనప్రియం చింతితప్రదం శ్రుతివిభూషణం సాధుజీవనమ్ | శ్రుతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే || శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా | శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా | || ఇతి శ్రీ హరిహరాత్మజాష్టకం సంపూర్ణమ్ ||  

మరింత సమాచారం
Swami Image
పూజ

అయ్యప్ప స్వామి నిత్యపూజా విదానం

 "స్వామియే శరణం అయ్యప్ప" శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ||అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే || గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ|గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః||   సర్వదేవతా ప్రార్ధనలు యకుందేందు తూషార హర ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యావీణా వరదండా మండిత కరా యశ్వేత పద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృత భిర్థేవై స్సదాపూజిత సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్సేష జాడ్యాసహ|| శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణే |వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే || అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞా వైరాగ్య సిద్ద్యర్ధం భిక్షం దేహించ పార్వతి || సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ద సాధకే |శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే||   భూతనాథ సదానంద సర్వభూత దయాపర |రక్షరక్ష మహాభాహో  శాస్తేతుభ్యం నమోనమః ||ఓం హ్రీం హరిహర పుత్రాయ పుత్ర లాభాయ శతృ నాశాయ మద గజ వాహనాయ మహా శాస్త్రే నమఃభుతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్||   మనోజవం మారుత తుల్య వేగం! జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ !!వాతాత్మజం వానరయూధ ముఖ్యం! శ్రీరామ దూతం శిరసా సమామి !!   శ్రీ అయ్యప్పస్వామి అంగపూజ (పుష్పాక్షతలతో పుజిoచాలి)   ఓం ధర్మశాస్త్రే నమః  పాదౌ పూజయామి ఓం శిల్పశాస్త్రే నమః గుల్బౌ పూజయామి ఓం వీరశాస్త్రే నమః జంఘే పూజయామి ఓం యోగశాస్త్రే నమః జానునీ పూజయామి ఓం మహాశాస్త్రే నమః ఊరుం పూజయామి ఓం బ్రహ్మశాస్తే నమః కటిం పూజయామి ఓం కాలశాస్తే నమః గుహ్యం పూజయామి ఓం శబరిగిరీశాయ నమః మేడ్రం పూజయామి ఓం సత్యరూపాయ నమః నాభిo పూజయామి ఓం మణికంఠాయ నమః ఉదరం పూజయామి  ఓం విష్ణు తనయాయ నమః  వక్షస్థలం పూజయామి ఓం ఈశ్వరపుత్రాయ నమః  పార్శ్వౌ పూజయామి ఓం హరిహరపుత్రాయ నమః  హృదయం పూజయామి ఓం త్రినేత్రాయ నమః కంఠం పూజయామి ఓం ఓంకార రూపాయ నమః స్తనౌ పూజయామి ఓం వరద హస్తాయ నమః హస్తాన్ పూజయామి ఓం భీమాయ నమః బాహూన్ పూజయామి ఓం తేజస్వినే నమః ముఖం పూజయామి ఓ అష్టమూర్తయే నమః దంతాన్ పూజయామి  ఓం శుభ వీక్షణాయ నమః నేత్రే పూజయామి ఓం కోమలాంగాయ నమః కర్ణౌ పూజయామి ఓం పాపవినాశాయ నమః లలాటం పూజయామి ఓం శత్రునాశాయ నమః నాసికం పూజయామి ఓం పుత్ర లాభాయ నమః చుబుకం పూజయామి ఓం గజాధిపాయ నమః ఔష్టౌ పూజయామి ఓం హరిహరాత్మజాయ నమః  గండస్థలం పూజయామి ఓం గణేశ పూజ్యాయ నమః  కచాన్ పూజయామి ఓం చిద్రూపాయ నమః శిరసాన్ పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి      శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళి (పువ్వులతో పుజిoచాలి)  ఓం రేవంద ఋషి ! గాయత్రీ చ్చందః శాస్తాదేవతా | ఓం రత్నాభం సుప్రసన్నం శశిధర మకుటం రత్న భూషాభిరామం | శులకేలం కపాలం సరముసల ధనువార్బాహు సంగేభ దానం మత్తే మారూఢ మాధ్యం హరిహర తనయం కోమలాoగo దాయాద్యం విశ్వేశం భక్త వంద్యం నతజన వరధం గ్రామపాలం నమామి | ఓం మహాశాస్త్రే నమఃఓం శిల్ప శాస్త్రే నమఃఓం లోక శాస్త్రే నమఃఓం మహాబలాయ నమఃఓం ధర్మ శాస్త్రే నమఃఓం వీర శాస్త్రే నమఃఓం కాలశాస్త్రే నమఃఓం మహోజసే నమఃఓం గాజాధిపాయ నమఃఓం అoగపతయే నమఃఓం వ్యాఘ్రపతయే నమఃఓం మహాద్యుతాయ నమః ఓం గణాద్యక్షాయ నమః ఓం మహాగణగుణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః  ఓం ఋగ్వేద రూపాయ నమః ఓం నక్షత్రాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం వలహకాయ నమః ఓం దూర్వాయ నమః ఓం శ్యామాయ నమః ఓం మహారూపాయ నమః ఓం క్రూర ద్రుష్టయే నమః ఓం అనామయాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం ఉత్పలాకారయ నమః ఓం కాలాoతకాయ నమః ఓం వరాధిపాయ నమః ఓం దక్ష మూషకాయ నమః ఓం కల్హార కుసుమ ప్రియాయ నమః ఓం మదనాయ నమః ఓం మాధవ సుతాయ నమః ఓం మందార కుసుమ ప్రియాయ నమః ఓం మదలాసాయ నమః ఓం వీరశాస్త్రే నమః ఓం మహాసర్ప విభూషణాయ నమః ఓం మహాశూరాయ నమః ఓం మహాధీరాయ నమః ఓం మహాపాప వినాశకాయ నమః ఓం అసి హస్తాయ నమః ఓం శరధరాయ నమః ఓం హాలాహాల ధర సుతాయ నమః ఓం అగ్ని నయనాయ నమః ఓం అర్జున పతయే నమః ఓం అనంగ మధునాతురాయ నమః ఓం దుష్ట గ్రహధిపాయ నమః ఓం శాస్త్రే నమః  ఓం శిష్ట రక్షణ దీక్షితాయ నమః ఓం రాజ రాజార్చితాయ నమః ఓం రాజశేఖరాయ నమః ఓం రాజసోత్తమాయ నమః ఓం మంజులేశాయ నమః ఓం వర రుచయే నమః ఓం వరదాయ నమః ఓం వాయు వాహానాయ నమః ఓం వజ్రంగాయ నమః ఓం విష్ణు పుత్రాయ నమః ఓం ఖడ్గ ప్రాణయే నమః ఓం బలోద్యుతాయ నమః ఓం త్రిలోక జ్ఞానాయ నమః ఓం అతిబలాయ నమః ఓం కస్తూరి తిలకాంచితాయ నమః ఓం పుష్కరాయ నమః ఓం పూర్ణ ధవళాయ నమః ఓం పూర్ణ లేశాయ నమః ఓం కృపాలాయ నమః ఓం వనజనాధిపాయ నమః ఓం పాశ హస్తాయ నమః ఓం భయపహాయ నమః ఓం బకార రూపాయ నమః ఓం పాపఘ్నాయా నమః ఓం పాషాoడరుదిరాశనాయ నమః ఓం పంచపాండవ సంరక్షకాయ నమః ఓం పరపాప వినాశకాయ నమః ఓం పంచవక్త్ర కుమారాయ నమః ఓం పంచాక్షరీ పారాయణాయ నమః ఓం పండితాయ నమః ఓం శ్రీధర సుతాయ నమః ఓం న్యాయాయ నమః ఓం కవచినే నమః ఓం కరీణామధిపాయ నమః ఓం కాండయజుషే నమః ఓం తర్పణ ప్రియాయ నమః ఓం శ్యామ రూపాయ నమః ఓం నవ్య ధన్యాయ నమః ఓం సత్సoతాప వినశకాయ నమః ఓం వ్యాఘ్రచర్మ ధరాయ నమః ఓం శూలినే నమః ఓం క్రుపాళాయ నమః ఓం వేణువదనాయ నమః ఓం కం కంఠాయ నమః ఓం కళరవాయ నమః ఓం కిరీటాధి విభుషితాయ నమః ఓం ధూర్జటినే నమః ఓం వీర నిలయాయ నమః ఓం వీరాయ నమః ఓం వీరేంద్ర వందితాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం వీర పతయే నమః ఓం వివిదార్ధ ఫలప్రదాయ నమః ఓం మహారూపాయ నమః ఓం చథుర్భాహవే నమః ఓం పరపాశ విమోచకాయ నమః ఓం నాగ కుండల ధరాయ నమః ఓం కిరీటాయ నమః ఓం జటాధరాయ నమః ఓం నాగాలoకార సంయుక్తాయ నమః ఓం నానా రత్న విభుషితాయ నమః     ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప!       అయ్యప్పస్వామి వారి శరణుఘొష   ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం అయ్యప్పదైవమే శరణమయ్యప్ప ఓం అఖిలలోకనాయకనే శరణమయ్యప్ప ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప ఓం అర్చన్ కోవిల్ అరసే శరణమయ్యప్ప ఓం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఓం అలుదామేడే శరణమయ్యప్ప ఓం అనాధనాదనే శరణమయ్యప్ప ఓం ఆదిమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప ఓం ఓంకారముర్తియే శరణమయ్యప్ప ఓం ఔదార్యముర్తియే శరణమయ్యప్ప ఓం ఔన్నత్యప్రియనే శరణమయ్యప్ప ఓం కర్పూర పరిమళ శోబితప్రియనే శరణమయ్యప్ప ఓం కరిమలవాసననే శరణమయ్యప్ప ఓం కరిమల ఏట్రమే శరణమయ్యప్ప ఓం కరిమల ఏరక్కమే శరణమయ్యప్ప ఓం కరుణాముర్తియే శరణమయ్యప్ప ఓం కలియుగ వరదనే శరణమయ్యప్ప ఓం కరుప్పస్వామియే శరణమయ్యప్ప ఓం కాళిడo కుండ్రమే శరణమయ్యప్ప ఓం కాంతమలై జ్యోతియే శరణమయ్యప్ప ఓం కానన వాసనే శరణమయ్యప్ప ఓం కుళుత్తుపులై బాలికనే శరణమయ్యప్ప ఓం ఆర్యాంగావయ్యనే శరణమయ్యప్ప ఓం ఆశ్రిత రాక్షకనే శరణమయ్యప్ప ఓం ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప ఓం ఇష్టప్రదయకనే శరణమయ్యప్ప ఓం ఇందిరారమణ ప్రియనే శరణమయ్యప్ప ఓం ఇంద్ర గర్వభంగనే శరణమయ్యప్ప ఓం ఈశ్వర తనయనే శరణమయ్యప్ప ఓం ఉమాసుతనే శరణమయ్యప్ప ఓం ఊర్థ్వరేతనే శరణమయ్యప్ప ఓం ఎరిమేలి ధర్మశాస్తావే శరణమయ్యప్ప ఓం ఎన్ కుల దైవమే శరణమయ్యప్ప ఓం ఏకాoతముర్తియే  శరణమయ్యప్ప ఓం ఐoదుమలైవాసనే శరణమయ్యప్ప ఓం ఐశ్వర్యముర్తియే శరణమయ్యప్ప ఓం గణపతి సోదరనే శరణమయ్యప్ప ఓం గoధాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం ఘంటానాద ప్రియనే శరణమయ్యప్ప ఓం జ్ఞానసంపదమూర్తియే శరణమయ్యప్ప ఓం చల్లని దైవమే శరణమయ్యప్ప ఓం ఛాయ రూపమే శరణమయ్యప్ప ఓం జగద్గురువే శరణమయ్యప్ప ఓం జగదానందదాయకనే శరణమయ్యప్ప ఓం టెంకాయ నీరాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం నాగరాజనే శరణమయ్యప్ప ఓం ఢoకానాద ప్రియనే శరణమయ్యప్ప ఓం తంజం ఆలిప్పవనే శరణమయ్యప్ప ఓం తారక బ్రహ్మముర్తియే శరణమయ్యప్ప ఓం త్రిమూర్తి ప్రియనే శరణమయ్యప్ప ఓం నవరత్నకిరీటి ధారినే శరణమయ్యప్ప ఓం నవనీత శక్తినే శరణమయ్యప్ప ఓం నారాయణసుతనే శరణమయ్యప్ప ఓం ఢమరుకప్రియసుతనే శరణమయ్యప్ప ఓం నిత్యబ్రహ్మచారియే శరణమయ్యప్ప ఓం నీలిమలైఏట్రమే శరణమయ్యప్ప ఓం పంపావాసనే శరణమయ్యప్ప ఓం పంచామృతాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం పందళరాజకుమారనే శరణమయ్యప్ప ఓం పంబయిల్ విళక్కనే శరణమయ్యప్ప ఓం పరబ్రహ్మజ్యోతియే శరణమయ్యప్ప ఓం పరాక్రమశాలియే శరణమయ్యప్ప ఓం పంబాస్నానమే శరణమయ్యప్ప ఓం పడునెనమిది సోపానాదిపతయే శరణమయ్యప్ప ఓం పాపసంహరనే శరణమయ్యప్ప ఓం పున్యముర్తియే శరణమయ్యప్ప ఓం పొన్నప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం పొన్నoబల వాసనే శరణమయ్యప్ప ఓం పెరియాన పట్టమే శరణమయ్యప్ప ఓం పౌరుషశక్తి ముర్తియే శరణమయ్యప్ప ఓం బంధవిముక్తనే శరణమయ్యప్ప ఓం బక్తవత్సలనే శరణమయ్యప్ప ఓం భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం భూతనాధనే శరణమయ్యప్ప ఓం మనికంఠదైవమే శరణమయ్యప్ప ఓం మదగజవాహననే శరణమయ్యప్ప ఓం మహిషిమర్దననే శరణమయ్యప్ప ఓం మకరజ్యోతియే శరణమయ్యప్ప ఓం మాలికారోత్తమదేవి మంజుమాతాయే శరణమయ్యప్ప ఓం మొహినిసుతనే శరణమయ్యప్ప ఓం మురళీలోలగానప్రియనే శరణమయ్యప్ప ఓం మొహనరూపమే శరణమయ్యప్ప ఓం యదవ ప్రియనే శరణమయ్యప్ప ఓం యజ్ఞ ప్రియనే శరణమయ్యప్ప ఓం యోగముర్తియే శరణమయ్యప్ప ఓం రక్షణముర్తియే శరణమయ్యప్ప ఓం రుద్రాంశముర్తియే శరణమయ్యప్ప ఓం లంబోదర ప్రియనే శరణమయ్యప్ప ఓం లక్ష్మివల్లభ ప్రియనే శరణమయ్యప్ప ఓం వన్పులివాహననే శరణమయ్యప్ప ఓం వావర్ స్వామియే శరణమయ్యప్ప ఓం విల్లాలి వీరనే శరణమయ్యప్ప ఓం వీరమణిగoడనే శరణమయ్యప్ప ఓం శక్తిదేవకుమారనే శరణమయ్యప్ప ఓం శరణాగత వత్సలనే శరణమయ్యప్ప ఓం శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప ఓం శబరి పీఠమే శరణమయ్యప్ప ఓం శతృసoహరముర్తియే శరణమయ్యప్ప ఓం షణ్ముఖ సోదరనే శరణమయ్యప్ప ఓం సకలరోగనివారణ ధన్వంతర ముర్తియే శరణమయ్యప్ప ఓం సచ్చిదానంద స్వరూపమే శరణమయ్యప్ప ఓం సకలకళావల్లభనే శరణమయ్యప్ప ఓం సంకటహరనే శరణమయ్యప్ప ఓం సద్గురునాథ ముర్థియే శరణమయ్యప్ప ఓం శ్రీ హరిహర సుతాన్, ఆనంద చిత్తన్, అయ్యన్, అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప.   భూతనాధ పంచరత్న - నమస్కార శ్లోకములు 1. లోకవీరం మహాపూజ్యాం సర్వరక్షాకరం విభుం      పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం       ఓం స్వామియే శరణం అయ్యప్ప 2. విప్రపూజ్యం విశ్వవంద్యం విస్మశంభో ప్రియం సుతం     క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమమ్యాహం     ఓం స్వామియే శరణం అయ్యప్ప 3. మత్త మాతాంగ గమనం కారుణ్యామృత పూరితం     సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమమ్యాహం     ఓం స్వామియే శరణం అయ్యప్ప 4. అస్మత్కులేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం     అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమమ్యాహం     ఓం స్వామియే శరణం అయ్యప్ప 5. పాండ్యేశ వంశ తిలకం కేరళీ కేళి విగ్రహం     ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమమ్యాహం     ఓం స్వామియే శరణం అయ్యప్ప 6. పంచరత్నాఖమే తధ్యో నిత్యం స్తోత్రం పఠేన్నరః     తస్యప్రసన్నో భగవాన్ శాస్తావసతి మానసే     ఓం స్వామియే శరణం అయ్యప్ప   స్తోత్రమ్ 7. అరుణోదయ సంకాశం నీలకుండళ ధారిణం     నీలాంబర ధరం దేవం వందేహం శంకరాత్మజం     ఓం స్వామియే శరణం అయ్యప్ప 8. చాపబాణం వామహస్తే రౌప్యవేత్రంచ దక్షిణే     విలసత్కుందల ధరం దేవం వందేహం విష్ణు నందనం     ఓం స్వామియే శరణం అయ్యప్ప 9. వాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాల విభూషణం     వీరపట్టం ధరం ఘోరం వందేహం శంభు నందనం     ఓం స్వామియే శరణం అయ్యప్ప 10. కింకణ్యోఢ్యాణ భూపేతం పూర్ణచంద్ర నిభాసనం      కిరాత రూప శాస్తారం వందేహం పాండ్య నందనం      ఓం స్వామియే శరణం అయ్యప్ప 11. భూతభేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసం       మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తినందనం       ఓం స్వామియే శరణం అయ్యప్ప 12. భూతనాద సదానంద సర్వభూత దయాపర       రక్షరక్ష మహాబాహూ శాస్త్రే తుభ్యం నమోనమః       ఓం స్వామియే శరణం అయ్యప్ప 13. భూతనాద సదానంద సర్వభూత దయాపర       రక్షరక్ష మహాబాహూ శాస్త్రే తుభ్యం నమోనమః       ఓం స్వామియే శరణం అయ్యప్ప 14. భూతనాద సదానంద సర్వభూత దయాపర       రక్షరక్ష మహాబాహూ శాస్త్రే తుభ్యం నమోనమః       ఓం స్వామియే శరణం అయ్యప్ప 15. శబరి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం       భక్తౌఘ పాపహంతారం అయ్యప్పన్ ప్రణమామ్యహం       ఓం స్వామియే శరణం అయ్యప్ప     కర్పూర హారతి శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికoఠ మంగళం శబరీశ మంగళం శాస్తాయ మంగళం మంగళం మంగళం నిత్యజయ మంగళం మంగళం మంగళం నిత్యశుభ మంగళం       ప్రదక్షిణ నమస్కారము   యానికానిచ పాపాని జాన్మాoతర క్రుతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష ధర్మశాస్త్ర   ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః అనంత కొటి ఆత్మ నమస్కారాన్,  ప్రార్దన నమస్కారాన్, ప్రదక్షిణ నమస్కారాన్, సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి             లోకవీర్యం చెప్పవలెను. రాత్రిపూజలతో హరివరాసన చెప్పి నిశ్శబ్దము పాటించవలెయును.           ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణమి.

మరింత సమాచారం
Swami Image
పూజ

ఆలోచనా తత్వం

ఆలోచనా తత్వం పొగిడినంతనే పొంగిపోకు. అందులో మర్మమేమిటో తెలుసుకో. ధర్మమనిపిస్తే సహాయము చెయ్యి, అధర్మమనిపిస్తే వదిలి వెయ్యి. జీవులపై ప్రేమను చూపండి-దేవుని ప్రేమను పొందండి. సరియైన మార్గములో నడవని వారు దేనిని సద్వినియోగము చేసుకోలేరు. జీవితానికి ప్రోత్సాహకర మాటలు అమృతాన్నిచ్చి, వెలుగు మార్గాలను చూపగలవు. ప్రేరణ ఉవయోగకరమైనదైతే ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. నిరుపయోగకరమైనదైతే నిలువునా పతనము చేయగలదు. ఇంట్లోపెట్టి పూజించే దేవుని పంచలోహ విగ్రహాలు ఇంటి యజమాని బ్రొటనవ్రేలి పరిమాణంలోనే ఉండాలి. ఆ సైజుకంటే పెద్దదిగా ఉండకూడదు, ఉండినచో దానికి తగిన రీతిగా ఆరాధనలు చేయవలసి వచ్చును. ఒక ఆడపిల్లను చదివించుట ఒక కుటుంబమును పోషించు నంత ఫలితమునిచును. మాట జారితే తిరిగి రాదు, కనుక ఆలోచించి మాట్లాడాలి. గతం నుంచి ప్రేరణ పొంది వర్తమానంలో భవిష్యత్తు గురించి ఆలోచించాలి. బాగా ఆలోచించు, కొద్దిగా మాట్లాడు, తక్కువగా వ్రాయి. భగవంతుని శరణు జొచ్చిన వానిని విధికూడా వేధించనెంచదు. అట్టివాని నుదుట బ్రహ్మ తాను వ్రాసిన వ్రాతను తానే మార్చివేయును. సూటి పోటి మాటలు సుడిగుండాలకన్నా భయంకరమైనవి. సుడి గుండాల్లో పడితే అదృష్టవశాత్తు తప్పించుకోవచ్చునేమో గాని, సూటి పోటు మాటల సుడిగుండాల్లో పడితే తప్పించుకోలేము. అందం కలిగిన వారే అపురూపులని భ్రమపడకండి. అంద విహీనులలో మంచి గుణము కలిగిన వారే అందమైన వారు కాగలరు. మూర్ఖత్వమునకు మందులేదు.అది అనుభవించవలసినదే. పెద్దవారితో స్నేహము పేదరికానికి పోటు లాంటిది. ఆలోచించకుండ అమలు పరచడము నియంత లక్షణము కాగలదు. నిరాశ తుఫాను లాంటిది. తుఫాను తాకిడికి గురైతే ఎంత ఆపదనో అలాగే నిరాశకు లోనైనా అంతే ఆపద ఉండును. కంచె లేని పొలానికి రక్షణ లేనట్లే శిక్షణలేని జీవితానికి కూడా రక్షణ ఉండదు. దేనినైనా నిర్ణయించి తీర్పునిచ్చేది కాలమే. దానికి ప్రతి ఒక్కరు తలవంచవలసిందే. విచక్షణ లేని మనిషి ఉప్పెన లాంటివాడు. ఉప్పెన వలన ప్రమాదాలు జరిగినట్లు విచక్షణ లేని మనిషి వలన కూడా ప్రమాదాలు జరుగగలవు. ఆత్మతృప్తి అనే ఐశ్వర్యాన్ని సంపాదించుకో, అపుడు బాధలు ఉండవు. హెచు తగ్గులు అగుపడవు. ఆత్మతృప్తి గలవానికి అందులోనే సుఖ మనే చక్కటి అమృత బిందువులు లభించును. ఫలించని దాని కోసము ప్రయత్నించకు. ఫలించే దాని కోసం ప్రయత్నించు. అదియే వివేకము. యదార్థమైన విభేదాలు తరచుగా సక్రమమైన అభివృద్ధికి చిహ్నాలు. ఏ కొద్దిపాటి అవకాశం దొరికినా మనిషి ఎప్పడూ ఆశావాదియే. ఆలోచనలకు, మాటలకు తేడా ఉండరాదు. ఆలోచించక చేసేపనులు తరువాత దుఃఖింప జేయును. నిద్రకోసం పరుండు వాడు సంసారి - నిద్రవచినపుడు పరుండువాడు సన్యాసి. అవిటివాడు అందలం ఎక్కాలనుకోనేకూడదు!అది వృధాశ్రమయగును. గ్రుడ్డివాడు చిత్రం గీయాలనుకోనే కూడదు!అది వల్లకానిదగును. మూగవాడు సంగీతం ఆలపించాలనుకోనే కూడదు!అదిసాధ్యంకానిది. కసాయివాడు పాపపుణ్యాలు ఆలోచించనేకూడదు!అది వృత్తికి వ్యతిరేకము. హృద్రోగి కొండ ఎక్కాలనుకోనేకూడదు! అది హానికరం. కడుపునొప్పివాడు విందు ఆరగించాలనుకోనేకూడదు! అది అపాయం. కాళ్ళులేనివాడు పాదరక్షల గురించి ఆలోచించనేకూడదు! అది అక్కరలేనిది. పండ్లు లేనివాడు చెఱకు తినాలనుకునేకూడదు!ఇది వీలు కానిది. జ్వరం వున్నవాడు ఐస్క్రీమ్ తినాలనుకునేకూడదు! అనారోగ్యానికి దారి. తలచినది సాధించేవరకు విశ్రమించకూడనేకూడదు! కార్యశూరిని లక్షణం. అల్పులతో సహవాసం చేయనేకూడదు! అది ప్రమాదకరం. భోజనవేళ మాట్లాదనేకూడదు!అది మంచి లక్షణం. ఆడ వాళ్ళపై అపవాదు వేయనేకూడదు! అది సమాజ హాని అబలలను హింసించనేకూడదు! అది అత్యాచారమునకు సమం. తల్లితండ్రుల మనసు క్షోభపెట్టనేకూడదు! అదియే నీకు పునరావృతం కాగలదు. చెడు సహవాసం చేయనేకూడదు! అది జీవితమును పతనం కావించును. పరస్త్రీలతో ఏకాంతంలో మాట్లాడనేకూడదు! అది ప్రమాదకరం. ఉపవాసవేళ వంటలు గూర్షి ఆలోచించనేకూడదు! అది ప్రత భంగం. బంధువులతో తగాదాలాడనేకూడదు! అది క్లేశకరం. మిత్రులను అనుమానించనేకూడదు! అది అనర్ధకరం. మనస్పున చెడుతలంపులుండనేకూడదు! అది హానికరం. ఎన్నడూ అబద్దమాడనేకూడదు! అది నిలువునా చీల్చి వేయును. భయపడుతూ మధ్యస్తం చేయనే కూడదు! అది చేతగానితనం. పెద్దలను తూలనాడనేకూడదు! అది దైవ నిందతో సమం. అబద్దపు సాక్ష్యంచెప్పనేకూడదు! అది అత్మవంచన. రోగులపై బలప్రయోగం చేయనేకూడదు! అది మూర్కుల లక్షణం. పసిపిల్లలను ఏడ్పించనేకూడదు! అది పైశాచికత్వమగును. బ్రాహ్మణులను హేళన చేయనేకూడదు! అది దైవ నిందతో సమం. పేదరికాన్ని పరిహాసమాడనేకూడదు! ఒక నాడు మనమలాకావచ్చును. తోబుట్టువులతో గొడవ పడనేకూడదు! అది వంశ హాని. ఎట్టి పరిస్థితిలోను ఆడవారిపైచేయి చేనుకోనే కూడదు! మగతనం కాదు. ఎట్టి పరిస్థితిలోను ఆత్మ స్థైర్యాన్ని పోగొట్టుకోనే కూడదు!వివేకుల లక్షణం. ఎట్టి పరిస్థితిలోను ఇరుగు పొరుగువారితో తగువులాడనేకూడదు! ఇతరుల సొముపై ఆశపడనేకూడదు!అది మన సొమ్ముకే హానికరం. దైవారాధన చేయక భోజనం చేయనేకూడదు! అది దొంగ తిండికి సమం. పనివాళ్ళపై దాడి చేయనేకూడదు! అది అడుసు త్రొక్కినట్లు. తాంబూలం ధరించి ఆలయప్రవేశం చేయనేకూడదు!అది మర్యాద కాదు. ఆడవాళ్ళు బోర్లపడిసాషాంగనమస్కారం చేయనేకూడదు! ఇది శాస్త్రం. నీచకృత్యములను చేయనేకూడదు!అది అశాంతికి దారితీయును. దుష్టసహవాసం చేయనేకూడదు! అది ప్రాణహానిని కలిగించును. నేరస్తులకు ఆశ్రయ మివ్వనేకూడదు!అది దేశద్రోహ చర్య యగును. ద్రోహులకు మన్నింపు ఇవ్వనేకూడదు!అది ఏనాటికైనా ముప్పే. గురుద్రోహం చేయనేకూడదు! అది ఉత్తమ శిష్యుల లక్షణం కాదు. దైవనింద చేయనేకూడదు! అది పాపకృత్యం అగును. ఆత్మస్తుతి చేసుకోనే కూడదు! అది హానికి దారితీయును. కులమతాల గూర్షి మాట్లాడనేకూడదు! అది చట్టవిరుద్ధం. మండల దీక్షలేక ఇరుముడి కట్టుకొననేకూడదు! అది ఆచారహీనం అగును. సూతకంతో దీక్షామాలను ధరించనేకూడదు!అది పద్దతి కాదు. ఆలయాలను అపవిత్రం చేయనేకూడదు!అది దైవనిలయాలు. బంధువులింట అధికారప్రయోగం చేయనేకూడదు!అది మన స్థలంకాదు. ఆత్మీయులవద్ద ప్రగల్భాలు పలుకనేకూడదు! అది తెలివితక్కువతనం. ఎట్టి పరిస్థితిల్లోను చట్టాన్ని ఆతిక్రమించనేకూడదు!అది నేరమగును. పిచ్చి వానివద్ద తెలివితేటలు ప్రదర్శించనేకూడదు! మనకు పిచ్చిపట్టును. నిప్పతో చెలగాటమాడనేకూడదు! అది ప్రాణహాని. జలమును వృధా చేయనేకూడదు! అది పొదుపు చేయదగినది. పూలను నలిపి వాసన చూడనే కూడదు! అది సువాసినులకు సమం.  

మరింత సమాచారం
Swami Image
పూజ

నామాట చంద్రునికో నూలు పోగు

నామాట...!  చంద్రునికో నూలు పోగు...! శ్రీచంద్రమౌళిగురుదేవాయ నమః - నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయి నందున మేము మాతాతగారింట పెరిగాము. నా అల్లరి మాన్పుటకు మాతల్లిగారు, ఆమె స్నేహితురాండ్రు నాకు చందమామ, బాలమిత్ర, భారతి మొదలగు పత్రికలు, శరత్, చలంగార్ల రచనలు, అష్టాదశ పురాణములు చదువుట అలవాటు చేసారు. అప్పటి నుండి వాటిలోనుండుసామెతలు, సందేశాత్మక వాక్యాలు, (సూక్తులు), మహనీయుల మహితోక్తులు వ్రాసుకోవడం అలవరచుకున్నాను. 2002వ సంవత్సరంలో నా ప్రాణమిత్రుడు ఉప్పల నాగేశ్వర రావు తమ తల్లిగారి జ్ఞాపకార్థము, నా సేకరణలోని కొన్నిటిని "అమృత బిందువులు" అనుపేర చిన్నపుస్తకము ముద్రించి వితరణ చేసారు. ఇది నాలోని ఈ అలవాటును ఇంకనూ కొనసాగించవలెనను ధృడ సంకల్పమును కల్గించినది.  ఆ (2002) సంవత్సరములోనే ఆ శబరిగిరీశుడు నాకొక అవకాశము కల్పించాడు. "అయ్యప్ప ఆరాధన" 3వ ముద్రణలో దాదాపు 2, 3 నెలల పాటు తిరుపతిలో పూజ్యశ్రీ చంద్రమౌళి గురుదేవులతో కూర్చొని ముద్రణలో పాలుపంచుకొన్నాను. అవి మరపురాని, మరువలేని మధురక్షణాలు. స్వామి అయ్యప్పగూర్చి, ఆయాత్రలోని పరమార్ధతత్వం గూర్చి క్షుణ్ణంగా వారు విడమరచి చెపుతుంటే నిజంగానే వారు అయ్యప్ప మానసపుత్రులే. తెలుగువారికి మలయాళ దేవుడైన స్వామి అయ్యప్పను గూర్చిన వివరాలను తెలుపగోరి కేరళలో పుట్టి మలయాళం చదువుకొన్న శ్రీ చంద్రమౌళి స్వామిని ఆంధ్రులకు మార్గదర్శిగా ఆ అయ్యప్ప పంపించాడేమోనని అనిపించినది. "ఆరాధనా శబ్ద కోశము", "సందేహ నివారిణి" శీర్షికల రూపకల్పనలో గురుదేవుల నుండి అయ్యప్ప తత్వము, నియమావళిలోని అంతరార్ధములు, ఆధ్యాత్మిక విషయములెన్నియో గ్రహించడం జరిగినది. ఈ అమృత బిందువులు శీర్షికలోని అత్యధిక బిందువులు 2002 సంuలో మా గురుదేవులైనవారి వాక్కునుండి జాలువారినవే. నేను వాటిని ఏరి అక్షర రూపం కల్పించాను అంతయే. ఈ సేకరణ నా పుస్తకములోనే నిక్షిప్తమై యుండి పోకుండా, పలువురికి చేరవేయాలనే తలంపుతో మాగురుదేవులు మన 'అయ్యప్ప విజయం" మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురిసూ వస్తున్నారు.  సాధారణంగా షష్టి పూర్తి శుభవేళలో శిష్యులే గురువులకు కానుకలు సమర్పించు కొంటారు. కాని నావిషయంలో గురదేవులే నాకు బహుమతి అందజేస్తున్నారు. ఇది కేవలం సద్గురు కటాక్షము గాక ఇంకేమనాలి. అందుకే వారు నెలనెల అందించే నెలరాజులాంటి 'అయ్యప్పవిజయానికి తోడుగా చంద్రునకో నూలు పోగులా ఈ 'అమృతబిందువులను' (తొమ్మిది తత్వాలుగా) సమకూర్షి ఇచ్చాను. ఈనాడు వారే దాన్ని ఒక చిన్నపుస్తకముగా ముద్రించాలని సంకల్పించారు. ఈపుస్తకాన్ని సహృదయముతో ముద్రించి, వారి షష్ఠిపూర్తి సందర్భముగా నాకు బహుమతిగా ఇచ్చిన మా గురుదంపతులకు కృతజ్ఞతాపూరిత పాదిభివందనములను సమర్పించుకొనుచున్నాను. ఇలాగే వారిరువురు వజ్రోత్సవమేగాక శతవార్షికోత్సవం జరుపుకొనుటకు కావలసిన ఆయురారోగ్యములు వారికి కలగచేయాలని, అలాగే ఆ మహోత్సవాలను నేనుకూడా తిలకించి, ఆనందించుటకు మాకు ఆయురారోగ్యములు ప్రసాదించవలయుననియు నేను అనునిత్యం కోరి కొలిచే స్వామి అయ్యప్పతో ప్రార్థిస్తున్నాను. ఇంకనూ ఈ పుస్తకము యొక్క కవర్ పేజిని చక్కగా డిజైన్ చేసిన అయ్యప్ప విజయం పబ్లికేషన్స్ వారి సిబ్దంది చిరంజీవులు చంద్ర, కుమారి ఉషా, సదాశివయ్య మరియు శ్రీనివాసులకు శుభాశీస్సులు. వారు రానున్న కాలములో అయ్యప్ప విజయానికి మరింత సేవ చేయాలనియు కోరుకొనుచున్నాను. ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరముగా ముద్రించి ఇచ్చిన కాకినాడ శ్రీపద్మనాభ ఆఫ్సెట్ ప్రింటర్స్, వారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ పుస్తకము చదివిన వారిలో ఏ ఒక్కరికైనా, ఏ ఒక్క సూక్తి వల్ల నైనా సత్ప్రయోజనం కల్గితే అట్టివారికి 'అమృత బిందువులు' లోని ఒక్క బొట్టు అమృతం అందినట్లే నని నాసేకరణ, ప్రచురణ వృధా కాలేదని విశ్వసిస్తాను. నేనీనాడు ఇంతటివాడినైనానంటే నేను నా గురువు నుండి పొందిన విషయ పరిజ్ఞానమే. ఇంతటి జన జ్యోతిని నాలో వెలిగించిన పూజ్య చంద్రమౌళి గురుదేవులకు నేనేమిచ్చి వారి ఋణము తీరుకోగలను! ధరిణిలో సూర్యచంద్రులున్నంత వరకు - మన "అయ్యప్ప విజయం ఉంటుంది. ఈ సేతురామునిలో జీవం వున్నంతవరకు "అయ్యప్ప విజయం" కొరకై శ్రమిసూ ఉంటాడు. ఇలాగే జరగాలని ఆ శబరిగిరీశుని ఎల్లవేళలా ప్రార్ధిసూ ఉంటాను. -స్వామిశరణం. సదా అయ్యప్ప భక్తుల సేవలో తరించాలని ఆకాంక్షించే.

మరింత సమాచారం
Swami Image
పూజ

స్వామివారి శరణుఘొష

  ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం అయ్యప్పదైవమే శరణమయ్యప్ప ఓం అఖిలలోకనాయకనే శరణమయ్యప్ప ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప ఓం అర్చన్ కోవిల్ అరసే శరణమయ్యప్ప ఓం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఓం అలుదామేడే శరణమయ్యప్ప ఓం అనాధనాదనే శరణమయ్యప్ప ఓం ఆదిమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప ఓం ఓంకారముర్తియే శరణమయ్యప్ప ఓం ఔదార్యముర్తియే శరణమయ్యప్ప ఓం ఔన్నత్యప్రియనే శరణమయ్యప్ప ఓం కర్పూర పరిమళ శోబితప్రియనే శరణమయ్యప్ప ఓం కరిమలవాసననే శరణమయ్యప్ప ఓం కరిమల ఏట్రమే శరణమయ్యప్ప ఓం కరిమల ఏరక్కమే శరణమయ్యప్ప ఓం కరుణాముర్తియే శరణమయ్యప్ప ఓం కలియుగ వరదనే శరణమయ్యప్ప ఓం కరుప్పస్వామియే శరణమయ్యప్ప ఓం కాళిడo కుండ్రమే శరణమయ్యప్ప ఓం కాంతమలై జ్యోతియే శరణమయ్యప్ప ఓం కానన వాసనే శరణమయ్యప్ప ఓం కుళుత్తుపులై బాలికనే శరణమయ్యప్ప ఓం ఆర్యాంగావయ్యనే శరణమయ్యప్ప ఓం ఆశ్రిత రాక్షకనే శరణమయ్యప్ప ఓం ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప ఓం ఇష్టప్రదయకనే శరణమయ్యప్ప ఓం ఇందిరారమణ ప్రియనే శరణమయ్యప్ప ఓం ఇంద్ర గర్వభంగనే శరణమయ్యప్ప ఓం ఈశ్వర తనయనే శరణమయ్యప్ప ఓం ఉమాసుతనే శరణమయ్యప్ప ఓం ఊర్థ్వరేతనే శరణమయ్యప్ప ఓం ఎరిమేలి ధర్మశాస్తావే శరణమయ్యప్ప ఓం ఎన్ కుల దైవమే శరణమయ్యప్ప ఓం ఏకాoతముర్తియే  శరణమయ్యప్ప ఓం ఐoదుమలైవాసనే శరణమయ్యప్ప ఓం ఐశ్వర్యముర్తియే శరణమయ్యప్ప ఓం గణపతి సోదరనే శరణమయ్యప్ప ఓం గoధాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం ఘంటానాద ప్రియనే శరణమయ్యప్ప ఓం జ్ఞానసంపదమూర్తియే శరణమయ్యప్ప ఓం చల్లని దైవమే శరణమయ్యప్ప ఓం ఛాయ రూపమే శరణమయ్యప్ప ఓం జగద్గురువే శరణమయ్యప్ప ఓం జగదానందదాయకనే శరణమయ్యప్ప ఓం టెంకాయ నీరాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం నాగరాజనే శరణమయ్యప్ప ఓం ఢoకానాద ప్రియనే శరణమయ్యప్ప ఓం తంజం ఆలిప్పవనే శరణమయ్యప్ప ఓం తారక బ్రహ్మముర్తియే శరణమయ్యప్ప ఓం త్రిమూర్తి ప్రియనే శరణమయ్యప్ప ఓం నవరత్నకిరీటి ధారినే శరణమయ్యప్ప ఓం నవనీత శక్తినే శరణమయ్యప్ప ఓం నారాయణసుతనే శరణమయ్యప్ప ఓం ఢమరుకప్రియసుతనే శరణమయ్యప్ప ఓం నిత్యబ్రహ్మచారియే శరణమయ్యప్ప ఓం నీలిమలైఏట్రమే శరణమయ్యప్ప ఓం పంపావాసనే శరణమయ్యప్ప ఓం పంచామృతాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం పందళరాజకుమారనే శరణమయ్యప్ప ఓం పంబయిల్ విళక్కనే శరణమయ్యప్ప ఓం పరబ్రహ్మజ్యోతియే శరణమయ్యప్ప ఓం పరాక్రమశాలియే శరణమయ్యప్ప ఓం పంబాస్నానమే శరణమయ్యప్ప ఓం పడునెనమిది సోపానాదిపతయే శరణమయ్యప్ప ఓం పాపసంహరనే శరణమయ్యప్ప ఓం పున్యముర్తియే శరణమయ్యప్ప ఓం పొన్నప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం పొన్నoబల వాసనే శరణమయ్యప్ప ఓం పెరియాన పట్టమే శరణమయ్యప్ప ఓం పౌరుషశక్తి ముర్తియే శరణమయ్యప్ప ఓం బంధవిముక్తనే శరణమయ్యప్ప ఓం బక్తవత్సలనే శరణమయ్యప్ప ఓం భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓం భూతనాధనే శరణమయ్యప్ప ఓం మనికంఠదైవమే శరణమయ్యప్ప ఓం మదగజవాహననే శరణమయ్యప్ప ఓం మహిషిమర్దననే శరణమయ్యప్ప ఓం మకరజ్యోతియే శరణమయ్యప్ప ఓం మాలికారోత్తమదేవి మంజుమాతాయే శరణమయ్యప్ప ఓం మొహినిసుతనే శరణమయ్యప్ప ఓం మురళీలోలగానప్రియనే శరణమయ్యప్ప ఓం మొహనరూపమే శరణమయ్యప్ప ఓం యదవ ప్రియనే శరణమయ్యప్ప ఓం యజ్ఞ ప్రియనే శరణమయ్యప్ప ఓం యోగముర్తియే శరణమయ్యప్ప ఓం రక్షణముర్తియే శరణమయ్యప్ప ఓం రుద్రాంశముర్తియే శరణమయ్యప్ప ఓం లంబోదర ప్రియనే శరణమయ్యప్ప ఓం లక్ష్మివల్లభ ప్రియనే శరణమయ్యప్ప ఓం వన్పులివాహననే శరణమయ్యప్ప ఓం వావర్ స్వామియే శరణమయ్యప్ప ఓం విల్లాలి వీరనే శరణమయ్యప్ప ఓం వీరమణిగoడనే శరణమయ్యప్ప ఓం శక్తిదేవకుమారనే శరణమయ్యప్ప ఓం శరణాగత వత్సలనే శరణమయ్యప్ప ఓం శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప ఓం శబరి పీఠమే శరణమయ్యప్ప ఓం శతృసoహరముర్తియే శరణమయ్యప్ప ఓం షణ్ముఖ సోదరనే శరణమయ్యప్ప ఓం సకలరోగనివారణ ధన్వంతర ముర్తియే శరణమయ్యప్ప ఓం సచ్చిదానంద స్వరూపమే శరణమయ్యప్ప ఓం సకలకళావల్లభనే శరణమయ్యప్ప ఓం సంకటహరనే శరణమయ్యప్ప ఓం సద్గురునాథ ముర్థియే శరణమయ్యప్ప ఓం శ్రీ హరిహర సుతాన్, ఆనంద చిత్తన్, అయ్యన్, అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప.

మరింత సమాచారం
Swami Image
పూజ

శ్రీ అయ్యప్పస్వామి అంగపూజ (పుష్పాక్షతలతో పుజిoచాలి)

ఓం ధర్మశాస్త్రే నమః  పాదౌ పూజయామి ఓం శిల్పశాస్త్రే నమః గుల్బౌ పూజయామి ఓం వీరశాస్త్రే నమః జంఘే పూజయామి ఓం యోగశాస్త్రే నమః జానునీ పూజయామి ఓం మహాశాస్త్రే నమః ఊరుం పూజయామి ఓం బ్రహ్మశాస్త్రే నమః కటిం పూజయామి ఓం కాలశాస్త్రే నమః గుహ్యం పూజయామి ఓం శబరిగిరీశాయ నమః మేడ్రం పూజయామి ఓం సత్యరూపాయ నమః నాభిo పూజయామి ఓం మణికంఠాయ నమః ఉదరం పూజయామి  ఓం విష్ణుపుత్రాయ నమః  వక్షస్థలం పూజయామి ఓం ఈశ్వరపుత్రాయ నమః  పార్శ్వౌ పూజయామి ఓం హరిహరపుత్రాయ నమః హృదయం పూజయామి ఓం త్రినేత్రాయ నమః కంఠం పూజయామి ఓం ఓంకారరూపాయ నమః స్తనౌ పూజయామి ఓం వరదహస్తాయ నమః హస్తాన్ పూజయామి ఓం భీమాయ నమః బాహూన్ పూజయామి ఓం తేజస్వినే నమః ముఖం పూజయామి ఓ అష్టమూర్తయే నమః దంతాన్ పూజయామి  ఓం శుభవీక్షణాయ నమః నేత్రౌ పూజయామి ఓం కోమలాంగాయ నమః కర్ణౌ పూజయామి ఓం పాపవినాశాయ నమః లలాటం పూజయామి ఓం శత్రునాశాయ నమః నాసికం పూజయామి ఓం పుత్రలాభాయ నమః చుబుకం పూజయామి ఓం గజాధిపాయ నమః ఔష్టౌ పూజయామి ఓం హరిహరాత్మజాయ నమః గండస్థలం పూజయామి ఓం గణేశ్యపూజ్యాయ నమః కుచాన్ పూజయామి ఓం చిద్రూపాయ నమః శిరసాన్ పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి    

మరింత సమాచారం
Swami Image
పూజ

ప్రదక్షిణ నమస్కారము

యానికానిచ పాపాని జాన్మాoత క్రుతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష ధర్మశాస్త్ర ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః అనంత కొటి ఆత్మ నమస్కారాన్,  ప్రార్దన నమస్కారాన్, ప్రదక్షిణ నమస్కారాన్, సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి             లోకవీర్యం చెప్పవలెను. రాత్రిపూజలతో హరివరాసన చెప్పి నిశ్శబ్దము పాటించవలెయును.           ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణమి.

మరింత సమాచారం
Swami Image
పూజ

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళి (పువ్వులతో పుజిoచాలి)

         ఓం రేవందర ఋషి ! గాయత్రిచ్చందః | ఓం రత్నాభం సుప్రసన్నంశశిధర మకుటం రత్న భూషాభిరామం | శులకేలం కపాలం సరముసల ధనువార్ బాహు సంగేధ దానం మత్తేమారూఢ మాధ్య హరిహర తనయం కోమలాoగo దయాద్యం విశ్వేశం భక్త వంద్యం నతజన వదనం గ్రామపాలం నమామి |   ఓం మహాశాస్త్రే నమః ఓం శిల్పశాస్త్రే నమః ఓం లోకశాస్త్రే నమః ఓం మహాబలాయ నమః ఓం ధర్మశాస్త్రే నమః ఓం వీరశాస్త్రే నమః ఓం కాలశాస్త్రే నమః ఓం మ       జసే నమః ఓం గాజాధిపాయ నమః ఓం అoగపతయే నమః ఓం వ్యఘ్రపతయే నమః ఓం మహాద్యుతాయ నమః ఓం గణాద్యక్షాయ నమః ఓం మహాగణగుణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః  ఓం ఋగ్వేదరూపాయ నమః ఓం నక్షత్రాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం వలహకాయ నమః ఓం దూర్వాయ నమః ఓం శ్యామాయ నమః ఓం మహారూపాయ నమః ఓం క్రూర ద్రుష్టయే నమః ఓం అనామాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం ఉత్పలాకారయ నమః ఓం కాలాoతకాయ నమః ఓం నరాధిపాయ నమః ఓం దక్షమూషకాయ నమః   ఓం కల్పారకుసుమప్రియాయ నమః ఓం మదనాయ నమః ఓం మాధవసుతాయ నమః ఓం మందార కుసుమ ప్రియాయ నమః ఓం మదలాసాయ నమః ఓం వీరశాస్త్రే నమః ఓం మహాసర్ప విభూషణాయ నమః ఓం మహాశూరాయ నమః ఓం మహాధీరాయ నమః ఓం మహాపాపవినశకాయ నమః ఓం అసిహస్తాయ నమః ఓం శరధరాయ నమః ఓం హాలాహాలధరసుతాయ నమః ఓం అగ్నినయనాయ నమః ఓం అర్జునపతయే నమః ఓం అనంగమధునాతురాయ నమః ఓం దుష్టగ్రహధిపాయ నమః ఓం శాస్త్రే నమః నమః ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః ఓం రాజరాజార్చితాయ నమః ఓం రాజశేఖరాయ నమః ఓం రాజసోత్తమాయ నమః ఓం మంజులేశాయ నమః ఓం వరరుచయే నమః ఓం వరదాయ నమః ఓం వాయువాహానాయ నమః ఓం వజ్రంగాయ నమః ఓం విష్ణుపుత్రాయ నమః ఓం ఖడ్గపాణయే నమః ఓం బలోద్యుతాయ నమః ఓం త్రిలోకజ్ఞానాయ నమః ఓం అతిబలాయ నమః ఓం కస్తూరితిలకాంచితాయ నమః ఓం పుష్కరాయ నమః ఓం పూర్ణ ధవళాయ నమః ఓం పూర్ణలేశాయ నమః ఓం కృపాలాయ నమః ఓం వనజనాధిపాయ నమః ఓం పాశహస్తాయ నమః ఓం భయపహాయ నమః ఓం బకారరూపాయ నమః ఓం పాపఘ్నాయా నమః ఓం పాషాoడరుదిరాశనాయ నమః ఓం పంచపాండవ సంరక్షకాయ నమః ఓం పరపాప వినాశకాయ నమః ఓం పంచవక్త్ర పరాయణాయ నమః ఓం పంచాక్షరీ పారాయణాయ నమః ఓం పండితాయ నమః ఓం శ్రీధర సుతాయ నమః ఓం న్యాయాయ నమః ఓం కవచనే నమః ఓం కాండయూజషే నమః ఓం తర్పణ ప్రియాయ నమః ఓం శ్యామరూపాయ నమః ఓం నవ్య ధన్యాయ నమః ఓం సత్సoతాప వినశకాయ నమః ఓం వ్యాఘ్ర చర్మ ధరాయ నమః ఓం శూలినేక్రుపాళాయ నమః ఓం వేణువదనాయ నమః ఓం కంచుకంఠాయ నమః ఓం కళారవాయ నమః ఓం కిరీటాధి విభుషితాయ నమః ఓం ధూర్జటినే నమః ఓం వీరనిలయాయ నమః ఓం వీరాయ నమః ఓం వీరేంద్ర వందితాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం వీరపతయే నమః ఓం వివిదార్ధ ఫలప్రదాయ నమః ఓం మహారూపాయ నమః ఓం చథుర్భాహూవే నమః ఓం పరపాశవిమోచనాయ నమః ఓం నాగకుండలధరాయ నమః ఓం కిరీటాయ నమః ఓం జటటాధదాయ నమః ఓం నాగాలoకార సంయుక్తాయ నమః ఓం నానారత్నవిభుషితాయ నమః  

మరింత సమాచారం
Swami Image
పూజ

కర్పూర హారతి

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం గణేశాయ మంగళం దత్తాత్రేయ మంగళం నారాయణ మంగళం నమశ్శివాయ మంగళం ఓం శక్తి మంగళం జై శక్తి మంగళం శ్రీశక్తి మంగళం శివశక్తి మంగళం సాయినాథ మంగళం రాఘవేంద్ర మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం అయ్యప్ప మంగళం మణికoఠ మంగళం శబరీశ మంగళం శాస్తాయ మంగళం మంగళం మంగళం నిత్యజయ మంగళం మంగళం మంగళం నిత్యశుభ మంగళం మంగళం మంగళం జయ మంగళం హరిహరులపుత్రుడైన అయ్యప్పకు మంగళం మంగళం కోసవేoద్రాయ మహనీయ గుణాత్మనే | శబరిగిరి నివాసాయ ధర్మశాస్తాయ మంగళం || ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్పస్వామినే నమః మంగళాచర నీరాజనం సమర్పయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భూతనాథాయ విద్మఏ భవపుత్రాయ ధీమి తన్నోశాస్త్ర ప్రచోదయాత్ ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః దివ్యశ్రీ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.    

మరింత సమాచారం
Swami Image
పూజ

సర్వదేవతా ప్రార్ధనలు

శ్రీ మహాగణపతి ప్రార్ధన శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ||అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ||   శ్రీ గురు ప్రార్ధన గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః |గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ||అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచలం |తత్పదం దర్శతం యేన తస్మైశ్రీ గురవేనమః ||ధ్యానమూలం గురుమూర్తి| పూజామూలం గురువాక్యం | పదమూలం గురుపదానాం| మోక్షమూలం గురుప్రాప్తిః ||   అమ్మవారి ప్రార్దన యకుందేందు తూషార హరధవళ యాశుభ్ర వస్త్రాన్విత |యా వీణా వరదండా మండితకర యశ్వేత పద్మాసన ||యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృత భిర్థేవై: సదాపూజిత |సామాంపాతు సరస్వతి భగవతి నిశ్సేష్య జాడ్యాపహ ||శరదిందు సమాకారే పరహ్బ్రహ్మ స్వరూపుణే |వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ||అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే |జ్ఞానవైరాగ్య సిద్ద్యర్ధం భిక్షం దేహిచ పార్వతి ||సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ద సాధకే |శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే||   శ్రీ మహావిష్ణు ప్రార్ధన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం |విశ్వాకారం గగన సదృశ్యం మేఘ శుభాoగం ||లక్ష్మికాంతం కమల నయనం యోగి హృద్యాన గమ్యం |వందే విష్ణుం భువభాయ హారం సర్వలోకైనాథం ||   పరమేశ్వరుని ప్రార్ధన వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కరణం |వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం ||వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం |వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||   శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన శక్తి హస్తం విరూపాక్షం శిఖి వాహనం ద్విషడ్భుజం |తారకాసుర సంహారం శ్రీవళ్ళినాధం నమామ్యహం ||   శ్రీ రామచంద్రుని ప్రార్ధన శ్రీ రామ రామ రామేతి రమేరమే మనోరమే |సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే ||రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే |రఘునాథ నాథాయ సీతాత్ పతయేనమః ||   శ్రీ అయ్యప్పస్వామి వారి ప్రార్ధన భూతనాథ సదానంద సర్వభూత దయాపర |రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శతృనాశాయ మదగజ వాహనాయ మహా శాస్త్రే నమఃభుతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్రప్రచోదయాత్. శ్రీ ఆంజనేయస్వామి ప్రార్ధన ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం |తరుణార్క ప్రభూదుతం రామదుతం నమామ్యహం||మనోజవం మారుత తుల్యవేగం | జిత్రేంద్రియ బుద్దిమాతాం వరష్టతం |వాతాత్మజం వానరాయుధ ముఖ్యం | శ్రిరామదుతం శిరసానమామి ||  

మరింత సమాచారం
Swami Image
పూజ

శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత

మన హిందూ ధర్మసంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవితమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు. మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లకు తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభముని తాకి స్వామివారిని దర్శించుకుంటాము, అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలివనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది. ఇక సంఖ్యా శాస్త్రము ప్రకారము "18" సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గూర్చి చాలా చక్కగా చెప్పిరి. 1+8=9 అనునది పరిపూర్ణమైన సంఖ్య, అంతే కాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది, కావున భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూ యున్నారు. అందుకే మనము మన స్వామి పూజలలో కూడ పడిపూజ అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి పడిపూజ అంటున్నాము. మరి ఆ 18 సంఖ్య గూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం.       అమ్మవారి శక్తిపీఠములు - 18 1. శాంకరీ దేవి, 2. కామాక్షీ దేవి, 3. శృంఖలాదేవి, 4. చాముండేశ్వరీ, 5. జోగులాంబ, 6. భ్రమరాంబ, 7. మహాలక్ష్మీ, 8. ఏకవీరిక, 9. గిరిజాదేవి, 10. మాణిక్యాంబ, 11. కామరూపిణి, 12. మాధవేశ్వరి, 13. మహాకాళి, 14. పురుహుతిక, 15. వైష్ణవీదేవి, 16. మాంగళ్యగౌరీ, 17. విశాలాక్షీ, 18. సరస్వతి.   వ్యాసమహాముని వ్రాసిన పురాణాలు - 18 1. మత్స్యపురాణము, 2. మార్కండేయ పురాణము, 3. దేవీభాగవత పురాణము, 4. భవిష్యత్పురాణము, 5.బ్రహ్మాండపురాణము, 6. బ్రహ్మవైవక్త పురాణము, 7. వరాహపురాణము, 8. వామనపురాణము, 9. విష్ణు పురాణము, 10. వాయు పురాణము, 11. అగ్నిపురాణము, 12. నారదపురాణము, 13. పద్మపురాణము, 14. లింగపురాణము, 15. గరుడపురాణము, 16. కూర్మపురాణము, 17. స్కాంద పురాణము, 18. బ్రహ్మపురాణము.   మహాభారతములోని పర్వములు - 18 1. ఆదిపర్వము, 2. సభాపర్వము, 3. అరణ్యపర్వము, 4. విరాటపర్వము, 5. ఉద్వేగపర్వము (వీటిని ఆది పంచాకాలని), 6. భీష్మపర్వము, 7. ద్రోణపర్వము, 8. కర్ణపర్వము, 9. శల్యపర్వము, 10. సౌప్తిక పర్వము, 11. శ్రీ పర్వము (వీటిని యుద్ధషష్ఠకములని, 12. శాంతి పర్వము, 13. అనుశాసన పర్వము, 14. ఆశ్రమవాస పర్వము, 15. అశ్వమేధపర్వము, 16. మౌసులపర్వము, 17. మహాప్రస్థాన పర్వము, 18. స్వర్గారోహణము (వీటిని శాంతి సప్తకములని).   భగవద్గీతలోని అధ్యాయములు - 18 1. అర్జున విషాదయోగము, 2. సంఖ్యాయోగము, 3. కర్మయోగము, 4. జ్ఞాన కర్మసన్యాస యోగము, 5. కర్మసన్యాస యోగము, 6. ఆత్మ సంయమయోగము, 7. జ్ఞానవిజ్ఞాన యోగము, 8. అక్షర పరబ్రహ్మయోగము, 9. రాజవిద్యరాజ గుహ్యయోగము, 10. విభూతి యోగము, 11. విశ్వరూప సందర్శన యోగము, 12. భక్తి యోగము, 13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, 14. గుణత్రయ విభాగ యోగము, 15. పురుషోత్తమ ప్రాప్తియోగము, 16. దైవాసుర సంపద్విభాగ యోగము, 17. శ్రద్దాత్రయ యోగము, 18. మోక్ష సన్యాస యోగము.   ఉప పురాణముల సంఖ్య - 18 1. సనత్కుమారము, 2. నృసింహ పురాణము, 3. స్కందపురాణము, 4. శివధర్మ పురాణము, 5. నందికేశ్వరపురాణము, 6. దుర్వాసపురాణము, 7. నారదీయ పురాణము, 8. కపిల పురాణము, 9. మానవ ఔజానన పురాణము, 10. మహేశ్వర పురాణము, 11. వారుణ పురాణము, 12. కాళీ పురాణము, 13. సాంబ పురాణము, 14. సౌర పురాణము, 15. పరశర పురాణము, 16. మారీచ పురాణము, 17. భార్గవ పురాణము, 18. బ్రహ్మాండ పురాణము.     స్మృతులు - 18 1.మనుస్మృతి, 2. బ్రహ్మస్మృతి, 3. దక్షస్మృతి, 4. గౌతమస్మృతి, 5. యమస్మృతి, 6. అంగీరసస్మృతి, 7. యోగీశ్వరస్మృతి, 8. ప్రచేసస్మృతి, 9. శాతతాప స్మృతి, 10. పరాశరస్మృతి, 11. సంవర్తనస్మృతి, 12. ఉశనస్మృతి, 13. శంఖస్మృతి, 14. లిఖితస్మృతి, 15. ఆత్రేయస్మృతి, 16. విష్ణుస్మృతి, 17. అపస్తంబస్మృతి, 18. హరీతస్మృతి.   సిద్ధులు - 18 1.అణిమ, 2. లహిమ, 3. మహిమ, 4. ఈశాక్త్వా, 5. వసిత్వ, 6. ప్రాకామ్యా, 7. బుద్ధి, 8. ఇచ్చా, 9. ప్రాప్తి, 10. సర్వకామ, 11. సర్వాసంపత్ప్రద, 12. సర్వప్రియంకర, 13. సర్వమంగళాకారణ, 14. సర్వదుఃఖవిమోచన, 15, సర్వమృత్యుప్రవాచ, 16. సర్వవిఘ్ననివారణ, 17. సర్వాంగసుందర, 18. సర్వాసౌభాగ్యదాయక.    విద్యలు - 181. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అధర్వణవేదము, 5. శిక్షా, 6. వ్యాకరణము, 7. చందస్సు, 8. నిరుక్త, 9. జ్యోతిష్యము, 10. కల్పము, 11. మీమాంస, 12. న్యాయశాస్త్రము, 13. పురాణాలు, 14. ధర్మశాస్త్రాలు, 15.ఆయుర్వేదము, 16. ధనుర్వేదము, 17. నీతిశాస్త్రము, 18. అర్ధశాస్త్రము. మానవ శరీరములో ఉన్న ముఖ్యమైన స్థానము - 18 1. మూలాధారం, 2. స్వాధిష్ఠానము, 3. మణిపూర్వకము, 4. అనాహతము, 5. లంబిక, 6. విశుద్ధి, 7. అంగత, 8. బిందు, 9. అర్ధచక్రము, 10. రోధిని, 11. నాధం, 12. సాంధారము, 13. శక్తి, 14. వ్యాపిక, 15. సమన, 16. ఉన్మన, 17. మహాబిందు, 18. సహస్రావరము.   శబరిమలై ప్రాంతములో స్వామివారి పవిత్రగిరులు(కొండలు) - 18 1.శబరిమలై, 2.కాంతమలై(పొన్నంబలమేడు, 3. నాగమలై, 4. సుందరమలై(సౌందర్యమలై), 5. చిత్రంబలమేడు, 6. కల్కిమలై, 7. మదంగమలై(మాతాంగమలై), 8. శ్రీపాదమలై, 9. గ్రౌండర్మలై(అప్పాచిమేడు), 10. దేవమలై, 11. నైలడంకుండ్రు, 12. తహైప్పార్ మలై, 13. నిలక్కల్ మలై, 14. పుడుచ్చేరిమలై, 15. కాళైకట్టి, 16. ఇంజిప్పారై, 17. కరిమలై, 18. నీలిమలై.   అష్టరాగ,పంచేంద్రియ,తిగుణ,జ్ఞానాజ్ఞనములు - 18 1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4. మోహము, 5. మాత్సర్యము, 6. దర్పము, 7. అహంకారము, 8. కన్ను, 9. ముక్కు, 10. చెవి, 11. నోరు (నాలుక), 12. చర్మము, 13. సత్వగుణము, 14. తమోగుణము, 15. రజోగుణము, 16. అవిద్య, 17. విద్య.   పద్దెనిమిది సార్లు మాల ధరించి వెళ్లి వచ్చిన స్వామి వార్ల పేర్లు - 181. కన్నెస్వామి, 2. కత్తిస్వామి, 3. గంటస్వామి, 4. గధాస్వామి, 5. పెరియస్వామి, 6. జ్యోతిస్వామి (గురుస్వామి), 7. సూర్యస్వామి, 8. చంద్రస్వామి, 9. త్రిశూలస్వామి, 10. విష్ణుచక్రస్వామి, 11. శంఖదార స్వామి, 12. నాగభరణస్వామి, 13. శ్రీహరి స్వామి, 14. పద్మస్వామి, 15. శ్రీస్వామి, 16. శ్రీశబరిగీశ్వరస్వామి (రాతిస్వామి), 17. ఓంకారస్వామి, 18. నారికేళస్వామి. పద్దెనిమిదిసార్లు శబరిమలై వెళ్ళిన స్వాములు ప్రతీ ఏట శరంగుత్తిలో వదిలిపెట్టే వస్తువులు - 181. శరము (బాణం), 2. కత్తి, 3. గంట, 4. గధ, 5. విల్లు (ధనస్సు), 6. జ్యోతి (దీపము), 7. సూర్యుడు, 8. చంద్రుడు, 9. త్రిశూలము, 10. విష్ణు చక్రము, 11. శంఖం, 12. నాగాభరణం, 13. వేలాయుధం, 14. పద్మము (కమలము), 15. శ్రీ, 16. రాయి, 17. ఓం, 18. కొబ్బరిచెట్టు. కాళికాదేవి యొక్క కరములు - 18అమ్మవారి యొక్క కాళికారూపములో ఆమె చేతులు మొత్తము పద్దెనిమిది. భారతయుద్ధము జరిగిన దినములు - 18కురుక్షేత్ర సంగ్రామములో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధము చేసినది పద్దెనిమిది రోజులు.   కురుపితామహుడు అంపశయ్యమీదనున్న దిననములు - 18 పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైన ఉన్నది 18 దినములు. భారత యుద్ధములో పాల్గొన్న అక్షౌహిణులు-18, సుప్రసిద్ధమైన భాషలు కూడా పద్దెనిమిది.అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల పదునెట్టాంబడిని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజలలోను ఇంత విలువ కలిగియున్నది. పద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప.        

మరింత సమాచారం
Swami Image
పూజ

శబరిమల సన్నిదానం వార్తావిశేషములు

స్వామివారి దీక్ష తీసుకొనుటకు వృచ్చిక, ధనుస్సు, మకర మాసములు (కార్తీక, మార్గశిర, పుష్య మాసములు) శ్రేష్టము. మండల పుజలకుగాను ప్రతీ సంవత్సరము నవంబరు నెల 15 లేదా 16 తేదీలలో సాయంత్రము మొదలు తెరవబడి, సన్నిదానము డిశంబరు 26 లేదా 27 తేదీలలో రాత్రి వరకు భక్తుల దర్శనార్ధం తెరవబదడివుండును. మండలకాలము నందు పగలు 12 గంటల వరకు నెయ్యాభిషేకం, సాయంత్రం పుష్పాభిషేకం, అలంకార దర్శనము మాత్రమే యుండును. ఈ మండలకాలములో పడిపూజలు ఉండవు. డిశంబరు నెల 27న మూయబడిన సన్నిధానం తిరిగి మకర మహోత్సవమునకు గాను అదే నెల ౩౦వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెరవబడి జనవరి 20వ తేదీ ఉదయం 7 గంటలకు మూయబడును. మకర మహోత్సవ కాలములో కుడా పగలు 12 గంటల వరకు మాత్రమే నేయ్యాభిషేకం చేయుదురు. జనవరి 16, 17, 18 తేదీలలో స్వామివారి ఆలయమునకు ముందున్న (దివ్య పదునెట్టాoబడి) పవిత్రమైన మెట్లకు సాయంత్రము 6 గంటల నుండి పడిపూజలు నిర్వహించెదరు. జనవరి 18వ తేదీన స్వామివారికి కళశాభిషేకం చేస్తారు. కళశాభిషేకం చేసిన తరువాత నేయ్యాభిషేకం చేయరు. అలాగే మణికంఠ స్వామివారు పందళరాజు వారికి చెప్పినట్లు, మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయంలో, పొన్నంబలమేడు సమీపంలో మకరజ్యోతి నక్షత్ర దర్శనం కనిపించును. అదియే మకరజ్యోతి. ఎరిమేలి నుండి పెద్దదారిలో పాదయాత్ర డిశంబరు 30 తేదీ నుండి జనవరి 14 వరకు మాత్రమే అనుమతించెదరు. ప్రతీ ఏటా స్వామివారి సన్నిధానములో మండలపూజ, మకర మహోత్సవం, నెలసరి పూజలు (ప్రతీనెలల్లోనూ), ఉత్సాహంపూజ, కొడియట్టుపూజ, ఆరట్టుపూజ, ఉత్తరఫంగుణి పూజ, విష్ణు మహోత్సవము, ప్రతిష్టాపనరోజు, ఓనం పూజ, శ్రీ చిత్తా అత్తురిణి పూజలు ఇటువంటి పండుగలు, పూజలు జరుగును.   

మరింత సమాచారం
Swami Image
పూజ

అన్నదాన విశిష్టత

దానాలన్నింటిలోను అన్నదానం మహాశ్రేష్టం (అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు) అందువలన అటువంటి దానిని వృధా చేయకూడదు. దానంగా ఎవరైనా ఏదైనా ఇస్తే, ఇంకా ఇస్తే బాగుండును అనిపిస్తుంది కాని అదే అన్నం దానంగా ఇస్తే ఎంత వరకు కావాలో అంతే మనము తినగాలుగుతాం కాబట్టే అన్నదానం శ్రేష్టమన్నారు. మనము శబరియాత్ర చేసే దారిలో ఎరుమేలి, పెరియానపట్టం, పంబా గణపతి మరియు ఆలయపు సన్నిదానము దగ్గరలో ఎన్నియో సంస్థలు జాతి, మత, కుల, గుణ, వర్ణ, వర్గ, భాషా భేదాలు లేక అందరిని అయ్యప్ప యొక్క ప్రతిరూపంగా భావించిన ప్రేమతో పిలిచి కడుపునిండా ఆహారం అంద చేస్తున్నారు. ఈ సౌకర్యమును అందరూ వినియోగించుకొనగలరు. స్వాములు తమతమ ఇరుముడులతో బాటు అన్నదానములకు కావలసిన బియ్యం, పప్పు, ఉప్పు, రవ్వ, చక్కర లాంటి ఏదైనా కొంతవరకు విడిగా తమ సైడు బ్యాగుల్లో తీసుకొని వెళ్లి, ఈ శబరిమలై యాత్రా శిబిరములలో ఎక్కడైనా అందజేసి శ్రీ అయ్యప్ప స్వామి వారి కటాక్షములకు పాత్రులు కాగలరు. శక్తిగలవారు ధనరూపేణ కుడా వారికి తోచిన విధంగా సహకరించి, అన్నదాన శిబిరములకు నిర్విరామముగా కొనసాగుటకు తోడ్పాటు అందించగలరు. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప. 

మరింత సమాచారం
Swami Image
పూజ

అయ్యప్ప మాల ధరించకూడని సందర్భములు

1. తల్లిదండ్రులు గతించినచో ఏడాదికాలము వరకు మాల ధరించరాదు. 2. సవతి తల్లిదండ్రులు గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.3. భార్య గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.4. సవతి భార్య (రెండవ భార్య) గతించినచో 3 నెలల వరకు మాల ధరించరాదు.5. పెదతండ్రులు, పినతండ్రులు, పెద్దతల్లులు, పినతల్లులు, గతించినచో 3 పక్షములు (45  రోజులు) మాల ధరించరాదు.6. సోదరులు, పుత్రులు, మేనత్తలు, మేనమామలు, తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) గతించినచో  41 దినములు  మాల ధరించరాదు. 7. కన్నకూతురు, కోడళ్ళు, అల్లుళ్ళు, మరదళ్ళు, వదినెలు, మరుదులు, బావలు, బావమరుదులు  గతించినచో 30 దినములు (1 నెలపాటు) మాల            ధరించరాదు. 8.మనవాళ్ళు, మనవరాళ్ళు, దాయాదులు  గతించినచో 21 దినములు  మాల ధరించరాదు. 9. ఇంటిపేరు గలవారు, రక్తసంబంధీకులు గతించినచో 21 దినములు  మాల ధరించరాదు. 10. వియ్యాలవారు, దూరపుబంధువులు గతించినచో 13 దినములు మాల ధరించరాదు. 11. ఆత్మీయులు, మిత్రులు గతించినచో 13 దినములు (దుఃఖము అనుష్ఠించి) మాల ధరించరాదు. 12.ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గతించినను అతనికి ఏడాదికాలము సూతకముండును కావున మాల ధరించరాదు.          దత్తతకు వెళ్ళిన తరువాత వాని కన్న తల్లిదండ్రులు గతించినచో 6 నెలలు సూతకముండును, కావున మాల ధరించరాదు.13. పైన తెలిపిన వారిలో ఎవరు గతించినను వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేసినచో అట్టివారికి కుడా ఏదాడి           సూతకముండును. కావున అట్టివారు ఏడాది కాలము మాల ధరించరాదు. 14. తల్లి, భార్య, కూతురు, కోడలు, మరదళ్ళు, సోదరి, మున్నగువారు 7 నెలల గర్భిని అయినచో మాల ధరించి దీక్ష తీసుకొనరాదు, ఏలనగా దీక్షలో ఉండగా     వారు (7వ నెల, 8వ నెల, 9వ నెలలో ఎప్పుడైనా) ప్రసవించినచో శుభ సూతకము వస్తుంది, కావున మాలను విసర్జన చేయవలసి వచ్చును.అందువలన       మాల ధరించరాదు.15. మాల ధరించి దీక్షలో ఉండగా కన్నకూతురు రాజ్వరాలు అయితే ఆ వార్త వినగానే తాను ఎన్ని దినములు దీక్ష ముగించినానను, వెంటనే దీక్ష విరమించి, గురుస్వామి ద్వారా మాల విసరర్జించి, మాలను కడిగి, దేవును వద్ద వుంచి, పై సంబరాలలో పాల్గొని, కూతురుకి న్యాయము చేకూరునట్లు తన కర్తవ్యాన్ని ఆచరించాలి. అదియే అయ్యప్పకు ఆనందదాయకము, భక్తులకు శ్రేయదాయకం. 16. దీక్షలో ఉండగా బందువర్గాదులలో ఎవరైన గతించినను ఆ వార్త తెలియగానే  మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవలయును, అలా కాక మాలో మాకు మాటలు, పలకరింపులు, రాకపోకలు అసలే లేవు మాకు ఆ మరణముతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాల విసర్జింపక సూతకముతో పావన శబరిగిరి ఎక్కుట అపచారము అని మన పెద్దలు ఆదేశించి యున్నారు, కావున శుభాశుభ  సూతకములు కలవారు పైన చెప్పిన సూచనల ప్రకారము తమ గురుస్వాములను సంప్రదించి, మాల విసర్జించి, శబరియాత్ర చేసి సద్గురునాధుడైన శబరిగిరీశుని అనుగ్రహము పొందుటకు ప్రయత్నించవలయును.17. కుటుంబములో శుభసూతకము లేదా అశుభసూతకము కలిగి మద్యలో దీక్ష విరమించవలసి వచ్చినవారు, తదుపరి వెంటనే మాల వేసుకొనక పావన పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి మండలకాలము అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశము ఉంటేనే మరల మాల ధరించవలయును, అలా వీలుకాని పక్షములో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుండా శబరిమలై సన్నిధానములోనే ఉత్తరవైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారిని దర్శించి వచ్చుటకు దోషము లేదు. 18. ఎవరైనా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాలవేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భము పోవడము కాని, గర్భస్రావము గాని, లేదా జన్మించిన తరువాత శిశువు పోవడము కాని జరిగినట్లయితే 10 రోజులు సూతకముండును. కావున మాలను విసర్జించవలయును. అలాగే మరల మండల కాలము సమయమున్నచో దీక్షబూని శబరియాత్ర చేయవచ్చును.19. స్త్రీలు మాత్రము 10 సంవత్సరాల వయస్సు దాటినా వారు మాల ధరించరాదు, ఏలనగా వారు ఏ సమయాన్నైనా ప్రథమ రజస్వ అయ్యే అవకాశముంది దాని వలన శుభసూతకం ఏర్పడుతుంది. అందువలన పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు. అలానే 50 సంవత్సరాలు వయస్సు దాటని వారు మాల ధరించి దీక్ష (41 రోజులు) పూర్తి కాదు. అందువలన వారికి శబరియాత్ర చేసే అర్హత లేదు.20. దీక్షా సమయములో మన సన్నిదానము దరిలో ఎవరైనా గతించినచో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమాచరించి శరణుఘోష చెప్పుతూ అఖండ దీపము ఆ రోజు వెలిగించి సన్నిదానము మూసివేయవలెను. సన్నిదానము స్వాములంతా కలిసి వేరే సన్నిదానములో ఉండవలెను.ఆ కళేబరము తీసిన తరువాత సన్నిదానమంతాశుభ్రపరచి ఆవు పంచకముతో శుద్ధి చేసి మరల పూజలు విధి విధానంగా జరుకోవలెను.21. మండల దీక్షలో ఉండగా గ్రహణములు (సూర్యగ్రహణము, చంద్రగ్రహణము) ఏర్పడినపుడు విధివిధానంగా పట్టు స్నానము విడుపుస్నానము చేయాలి.అలాగే       మన సన్నిదానములో కలశం వద్ద, గ్రహణము విడిచిన తరువాత కుశదర్భరేకులు వేసి ఉంచవలెను. గ్రహణము విడిచిన తరువాత స్నానమాచరించి             సన్నిదానము శుభ్రపరచి స్నానమాచరించి విధిగా దేవుని పూజలు జరిపించాలి. అలాగే గ్రహణ సమయమున తిను బండారము భిక్షలు చేయరాదు.          ఇంకా ఏదైనా కాని తెలియని విశాతాలు ఉంటే మీ గురుస్వామి ద్వారా తెలుసుకొని ఆయనగారు చెప్పినట్లు నడుచుకుని సద్గురునాధుని కటాక్షాన్ని పొంది ఆయురారోగ్య                ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.   ఓం శ్రీ అనాధ రాక్షకనే శరణం అయ్యప్ప                

మరింత సమాచారం
Swami Image
పూజ

అయ్యప్ప మాల ధరించువారు పాటించవలసిన నియమ నిబంధనలు

1. మొదటగా మీరు ఎప్పుడు ఎవరితో శబరియాత్ర చేయాలో నిర్ణయించాలి. 2. శబరిగిరివాసుని దర్శనార్ధమై మాల ధరించువారు ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు, పెండ్లి అయినవారు భార్య అనుమతి పొందుట మంచిది.3. అయ్యప్పస్వామి వారి మాల ధరించేవారు ముందుగా గురుస్వామి వద్దకు వెళ్లి గురుతత్వాన్ని, నియమనిబంధనలు తెలుసుకొని గురుస్వామి ద్వారా గాని, లేదా జన్మనిచ్చిన తల్లి ద్వారాగాని, దేవాలయ అర్చకస్వాముల ద్వారా గాని మాల ధరించాలి. అయితే గురుస్వామివారితో మాలధారణ చేయుట మంచిది.4. మొదటిసారి మాల ధరించువారు (కన్నెస్వాములు) మాత్రము పెద్దవారిలో నడిచి మకరజ్యోతిని దర్శించి శబరియాత్ర చేయుట మంచిది.5. మాలాధారియైన అయ్యప్పలు దీక్షా సమయము నందు నుదుటపై విభూతి, గంధము, కుంకుమ అలంకరించుట,మాలలో ఉన్న చిన్ముద్ర లాకెట్కు కుడా విధిగా అలంకరించుట మంచిది. (ఏలనగా విభూతి శివప్రీతి, గంధము విష్ణుప్రీతి, కుంకుమ శక్తిప్రీతి కాబట్టి)6. మాల ధరించిన ప్రతి అయ్యప్ప మండల దీక్షా కాలము అనగా 41 దినములు పూర్తి చేసిన పిదప తలపై ఇరుముడి ధరించి శబరియాత్ర చేయుట ఉత్తమము, మాల ధరించటానికి ముందురోజు మధుమాంస భక్షణము చేయరాదు. 7. ఎంతటివారైనను దీక్షపూని మెట్లెక్కే వేళకు 41 దినములు దీక్ష చేసి ఉండాలన్నది ముఖ్యము. అంతేకాని అర్ధమండలము (21 రోజులు), పావు మండలము (11 రోజులు), లేదా తిరిగి వచ్చిన పిదప వ్రతము పూర్తి చేయడం నిష్ఫలము, ధనవ్యయము, కాలము వృధా.8. దీక్ష సమయమున మాల ధరించువారు శివప్రీతి అయిన రుద్రాక్షమాల గాని, విష్ణుప్రీతి అయిన తులసిమాల లేదా చందనమాల ధరించుట మంచిది, దీని వలన హరిహరుల అనుగ్రహము, హరిహరాత్మజుని అనుగ్రహము లభించును. 9.ప్రతీ అయ్యప్ప దీక్షా సమయములో నలుపు, నీలం లేదా కాషాయ వస్త్రములనే ధరించాలి. కాని శని దేవుని ప్రీతీ కొరకు నలుపు వస్త్రములు ధరించుటయే శ్రేయస్కరము. 10. మాల ధరించిన స్వాములు నేలపైన నిద్రించాలి, పరుపులు, దిండ్లు వాడరాదు, పాదరక్షకులు వాడరాదు, క్షూరకర్మములు, కేశఖండన, గోళ్ళు తీయుట చేయరాదు.11. మాలధరించిన స్వాములు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్దితో బ్రహ్మచర్య వ్రతమును పాటించి, మధు, మాంస, ధూమపానము, మరియు బయట లభించే తినుబండారములను విసర్జించవలయును.12. మాలదారి అయిన స్వాములు పగలు, సాయంత్రము, రెండుపూటలా చన్నీటితో స్నానమాచరించాలి. పగలు భిక్ష, రాత్రి సాత్వికమైన అల్పాహారమును స్వీకరించుట శ్రేయస్కరము.13. ప్రతీ అయ్యప్ప ప్రాతఃకాలమున నిద్రలేచి పూజ స్థలమును శుభ్రపరచి బ్రహ్మముహూర్తకాలమున సర్వదేవతాస్తుతి మరియు అయ్యప్ప స్వామివారికి పూజను విధిగా చేయవలెను. అలాగే సుర్యాస్తమయమున కూడా అదే విధంగా జరిపించాలి.14. చదువురాని వారు విధిగా 108 మార్లు "ఓం స్వామియే శరణం అయ్యప్ప" అంటూ శరణుఘోష చేస్తే సరిపోతుంది.15. మాలాధారియైన స్వాములు నిరంతరము ఏకాంత వాసమున స్వామి నామమును జపిస్తూ ఉండాలి. స్వాములతో తప్ప ఇతరులతో ఎక్కువగా తిరుగుట వలన ఏకాగ్రత లోపించి దీక్ష నిబంధనలు కోల్పోవచ్చు.16. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షలో ఉండగా అశుభకార్యక్రమములో పాల్గొనరాదు. అలాగే అవసరముంటే తప్ప దూరప్రయాణాలు చేయరాదు.17. అయ్యప్పలు భుజించే పదార్ధములలో ఉల్లి, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులు వాడరాదు. వీలైనంత వరకు ఉప్పు, కారము వగరు తగ్గించుట మంచిది.18. దీక్షబద్ధులైన అయ్యప్పలు గురునింద, పరనింద, ఇతరులతో, వాదోపవాదనలు చేయరాదు. ప్రతీ అయ్యప్పస్వామి సమాజంలోని వ్యక్తులతో సంభాషించునపుడు గౌరవమర్యాదలను పాటించాలి.19. అయ్యప్పలు నడిచే దారిలో మరో అయ్యప్ప ఎదురైనప్పుడు "స్వామిశరణం" అని ఆత్మనమస్కారము చేయాలి. సమయానుకూలంగా పాద నమస్కారము కుడా చేయవచ్చు.20. అయ్యప్పలు నిద్రించినపుడు, పాదనమస్కారములు చేయునపుడు మెడలో ఉన్న మాల తాలూక లాకెటు (చిన్ముద్ర) నేలకు తాకకుండా జాగ్రత్త వహించాలి.21. అయ్యప్పలు దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు, దగ్గర బంధువులు, దాయాదులు ఎవరైనా పరమపదించినచో మాలను విసర్జింపవలయును.22. అయ్యప్పలు నడిచేదారిలో శవం ఎదురైనపుడు, లేక జనసందోహములో తిరిగినపుడు రజస్వల అయినవారు, బహిష్టు అయినవారు ఎదురైనపుడు, సన్నిధికి రాగానే ఆహారపానీయాలు తీసుకోకుండా శిరస్నానము చేసి శరణుఘోష చెప్పవలయును.23. ప్రతీ అయ్యప్పలు ఎవరైనా భిక్షకు, పూజకు మరియు భజనకు పిలిచినచో గురుస్వామి అనుమతి పొంది పాల్గొనవలయును. అంతేకాని నేను రాలేనని వాళ్ళను నొప్పించినట్లు చెప్పరాదు.24. ధనరూపేణ, వస్తురూపేణ వచ్చిన కానుకలు శబరిమలై అయ్యప్పస్వామి వారి హుండీలో వేయడం ద్వారా, మాల ధరించిన అయ్యప్పలు ధర్మబద్ధులు కాగలరు.25. మాలాధారి అయిన అయ్యప్పలు కుల, మత, జాతి, తన, పర, వర్ణ, వర్గ విభేదాలకు అతీతుడై ఉండాలి. తమ వృత్తి ధర్మాన్ని పాటించుకోవాలి, అంతేకాని దీక్షలో ఉన్నానని తమ పనులు మానుకోరాదు.26. అయ్యప్పల జీవితం సేవాభాగ్యంతో సాధుజీవనం గడపాలి, అధికార హోదాలు, ధనబలము, అప్పులు చేయుట, ఆడినమాట తప్పుట, ఆడంబరాలకుపోవుట, ఇతరులను నొప్పించుట చేయరాదు.27. మాలాధారి అయిన అయ్యప్పలు దీక్షలోను, పుజలలోను, భజనలలోను, భిక్షలోను, శరీరముపైన అంగవస్త్రం (చొక్కా) తీసి పాల్గొనుట మంచిది.28. ప్రతీ అయ్యప్ప దీక్షాకాలమందు చేయు పూజ, భుజించు భిక్ష, సుఖించు నిద్ర సృష్టి ప్రమాణమునకు అనుగుణంగా ఉండవలయును.29. మాల ధరించిన అయ్యప్పలకు కుటుంబసభ్యులు కూడా సహకరించుట వలన భగవంతుని సేవాభావంతో పాల్గొనే పుణ్యం కలుగుతుంది. దీక్షలోను, పూజలోను, భజన కార్యక్రమములో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలి. ౩౦. గృహములోని సభ్యులందరూ మధువు, మాంసము, విందులు, వినోదాలకు దూరంగా ఉండి, దీక్షలో ఉండే అయ్యప్పలకు సహకరించాలి. 31. తపోధనుడైన అయ్యప్పలకు శుచిగా, శుభ్రముగా, భిక్ష తయారు చేసి ఎవరైనా పెట్టవచ్చును.  32. మాల ధరించిన అయ్యప్పలు సమాజపరమైన పరిచయస్తులకు నమస్కారములు, కరచాలనములు చేయడం శ్రేయస్కరము కాదు. 33. అయ్యప్పలు గృహములో శుచి శుభ్రత పాటించుటకు ఇతరమైన సలహాలు సూచనలు గురుస్వామి ద్వారా పొందవలయును. 34. పడిపూజ జరిపే ప్రాంగణము (స్థలము) ఆర్భాటాల నిలయం కాకుండా శోభాయమానంగా అలంకరించి, పూజలు, భజనలు నిర్ధిష్టమైన సమయమున ప్రారంభించి నిర్ణీత సమయములో ముగించుట మంచిది. 35. సర్వము త్యజించి స్వామికి ప్రతిరూపమైన అయ్యప్ప దీక్షాకాలములో శరీరముపై అలంకారములు, ఆభరణాలు, ధరించి అందరివైపు దృష్టి సారించరాదు. 36. అయ్యప్పలు దీక్షలోను, పూజలోను, భజనలోను మరియు భిక్షలోను స్వామివారినే తలుచుకుంటూ నిశ్శబ్ధము వహించి మసలుకొనుట ఉత్తమము. 37. దీక్షలో ఉండగా అయ్యప్పలు పురుషులకు 'స్వామి' యని, స్తీలకు 'మాత' యని, పిల్లలకు 'మణికంఠ' అని సంభోదించాలి. 38. అయ్యప్పలు స్వామివారి పడిపూజలో పాల్గొనేముందు జన్మప్రదాతలైన తల్లిదండ్రులకు, జ్ఞానప్రదాతలైన గురుస్వామిగారికి, నమస్కరించి వారి ఆశీస్సులు పొంది పూజ ప్రారంభించవలయును. 39. అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు పెద్దలు కావున భిక్షలో కన్నెస్వాములకు మరీ మరీ వడ్డించి బలవంతము చేసి వినోదించుట మంచిది కాదు. 40. స్వామి భక్తితో మొదటిసారి మాలధరించిన కన్నెస్వాములకు మీ చేతులందించి ఆ కరుణామయుడైన శ్రీ అయ్యప్పస్వామి దర్శనము కలిగించి భగవంతుని అనుగ్రహము పొందండి. 41. స్వామువారికి నెయ్యాభిషేకం చేసి, అభిషేక ప్రసాదముతో ఇంటికి తిరిగి వచ్చి సన్నిదానమును కదిపిన తరువాతనే మాల విసర్జన మంత్రమును చెప్పుకుని గురుస్వామి ద్వారా గాని, కన్నతల్లితో గాని (గురుస్వామి అందుబాటులో లేనప్పుడు) మాల విసర్జన చేసి దీక్ష ముగించాలి. ఓం శ్రీ ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప.  

మరింత సమాచారం
Swami Image
పూజ

అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మవృత్తాంతము  క్లుప్తముగా అందరికి అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో వ్రాయడము జరిగింది. అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగారమును, మంధర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమును గాంచి భయబ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా, అది చూసిన పరమేశ్వరుడు హాలహలమును మ్రింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బందించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానమవులు మరల క్షీరసాగారమును మధించగా అమృతభాండము లభించినది, ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడు కొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా, జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోకసౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహంబున బంధించి అమృత భాండమును దేవతల కందించి వెడలుచుండగా, ఆ అతిలోకసుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయలీలలను గ్రహించిన వాడై మోహము నొందెను. మోహిని గాఢoగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి అధమరిచి కవ్వించెను. అంత ఆ హరిహరుల గాఢపరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీరఛాయతో ఉగ్రరూపధారియై ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను.తల్లి అయిన మోహిని (శ్రీహరి) తన కంఠమందున్ను మనిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాధుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉత్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచూ ధర్మశాస్తాగా ఖ్యాతి గడించెను. అలా అండగా మహిషాసురిని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశిర్వాదముతో శ్రీలక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా, మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా, అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కుడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరమడిగెను.అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంత ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా! జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును! అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకముము వదిలి నేనెలా భూలోకమునకు వెల్లుదుననే అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టె బాధలు భరించలేని దేవతలు, దేవేంద్రునీతో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాధునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాధుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మధ బాణాలను వదిలి మహిషిని మొహపరవశము చేశాడు, అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా  మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న అలుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేళి విలాసముతో మైమరపించుచుండెను. కేరళదేశము నందు పందళ రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు, అతడు పరమ శివభక్తుడు, ఆయన భార్యా సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు, అయినా వారికి చాలాకాలము వరకు సంతానము కలుగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించిన సంతానము కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానదీ తీర అడవి ప్రాంతములోని క్రూరమృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు, అంతలో పంబానదీ తీరమున సర్పము నీడన పవళించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకుని ఈయన ఆ భగవంతుని వర ప్రసాదముగా భావించి, ఆ బాలుని గొనివచ్చి మహారాణికి అందించెను. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకుని అక్కున చేర్చుకొని ఆనందపరవశురాలైనది. ఆ బాలుని కంఠమున మనిహారము దివ్యకాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణము చేసి ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకొనుచున్నారు.  ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగా నుండెను. అంతనే కాక పందళరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారున్ని ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి అయిదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతికాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రపారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను.ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్టించి యువరాజుగా పాలించే అర్హత లేదు యను నెపంతో రాణిగారికి దుర్భోద చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా, పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలయినది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చేరు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు యని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల ఋణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు. పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందళరాజు ఎత్తిన ఇరుముడిని తలపైదాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామి వారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానదీ తీరమువైపు పయనమైనాడు. అచట దత్తాత్రేయుడు మగమహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయమున నారదమహర్షి మహిషికి ఎదురై నిను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మహాఉగ్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షతత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాత్రుడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన రెండుచేతులతో మహిషిని లేవనెత్తి గిరగిర త్రిప్పుతూ అలుదానది తీరమున పడవేసెను. అంతట మహిషిలో నుండి శాపవిమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామి వారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్యబ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా, అపుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామీ! అని అడుగగా, మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవీ నీవు కుడా నా ప్రక్కనే మాళిగాపురోత్తమ్మగా వెలుగొంది నాతోపాటు నీవు కుడా పూజలను అందుకొని నా దీక్షబూని వచ్చిన స్వాములను భాదించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అపుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా, దేవీ! మొదటిసారి మాలధరించి కన్నెస్వామిగా 41 రోజుల దీక్షబూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు.  మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు యుండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి! మీరు మీ తల్లి గారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తుచేసి , ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందళ రాజ్యం చేరుతారు. అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా, పందళరాజు ఎదురువచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకొని, నాయన మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంస సంభూతుడివి, మా తప్పులు మన్నించి, మహారాణి, మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరింపక నాకవసరము లేదు. ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనుండుకి ఇవ్వండి. నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చితిననగా, మహారాజు, మహారాణి, మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు. అంతట పందళరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా, మహారాణి అప్పా మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా, వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా + అప్పా అని పిలిచి కన్నకొడుకుగా చుసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ, నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతీ మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నిష్టాగరిష్టులై తీసుకొని వచ్చి పడునెట్టాంబడిని  దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవస్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు. స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరితల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదునెనిమిది మెట్లతో పందళరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతీ మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి.   ఓం శ్రీ మణికంఠ దైవమే శరణం అయ్యప్ప.      

మరింత సమాచారం
Swami Image
పూజ

అయ్యప్ప దీక్ష

కేరళ రాష్ట్రంలో పంబానది తీర ప్రాంతంలో శబరిమలై అనే పర్వత సమూహము కలదు. ఆ కొండల ప్రాంతము చాలా భయంకరమైనది. పూర్వము ఆ ప్రాంతములోనే మహామునులు తపస్సు కొరకై అనేక ఆశ్రమాలు నిర్మించుకున్నారు. క్రూరమ్రుగములు నివశించే ఆ భయంకరమైన అడవి ప్రాంతములో పంబానదికి అతి సమీపములో ఐదుకొండల సమూహములో ఉన్న శబరి కొండపై హరిహరసుతుడు, అఖిలాండకోటి భాహ్మండ నాయకుడు, అనాధ రక్షకుడు, ఆపత్భాంధవుడు, ఆశ్రిత జన రక్షకుడు, కలియుగ వరదుడు, శ్రీ ధర్మశాస్త్రావారు,  మణికంఠుడిగా భూలోకంలో అవతరించి పండలరాజుకు ముద్దుల తనయుడై, పులిపాల కొరకు అడవికి వెళ్లి మహిషి అనే రక్షసిని సంహరించి, వావార్ అనే బందిపోటును తన భక్తునిగా మార్చి, శబరి తల్లికి మోక్షాన్ని ప్రసాదించి అతి కష్టతరమైన పట్టబందాసముతో చిన్ముద్రధారిగా అభయహస్తముతో అష్టాదశ సోపానములపై కూర్చున్న ఏకాంతవాసుడు శ్రీ అయ్యప్ప స్వామి వారికి శబరిమలైలో చూస్తూ ఉంటే భక్తి పారవశ్యంతో తనువు పులకరిస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు చేసే శరణుఘోషతో సన్నిధానము నలుమూలలు మారుమ్రోగుతూ ఉంటుంది. శ్రీ అయ్యప్పస్వామి వారి దర్శనం శబరిమలైలో పొందాలంటే కనీసము మండల కాలము అనగా 41 దినములు గాని ఆపైన ఎన్ని దినములు గాని మంచి గురుస్వామిని (ఇంతకు ముందు 6 సార్లు శబరిమలై యాత్ర చేసి వెళ్లి వచ్చినవారు) ఎంచుకొని నియమ నిబందనల ప్రకారము కఠినమైన దీక్ష చేసి సజ్జన సాంగత్యముతో దేవాలయాలలోను, పవిత్రమైన స్థలములలోను, స్వామివారి పూజలలోను, భగవంతుని నామాన్ని జపం చేస్తూ దీక్షను సాగించాలి. అలా దీక్ష చేసి శబరిమలై యాత్రకు వెళ్లి సత్ ఫలితాన్నిచే అయ్యప్పస్వామి వారి కృపా కటాక్షమును పొందుతారు. అందువల్ల అయ్యప్పదీక్ష శబరిమలై యాత్రలో ఎంతో పవితమైనది, కాబట్టి యాత్ర చేసే ప్రతి అయ్యప్పలు నియమ నిబంధనలు నిష్టతో పాటించి యాత్ర చేయవలసినదిగా కోరుతున్నాను.మనము చేసే పూజలు, భజనలు, భక్తితో సాగాలి కాని ఆడంబరాలకు పోయి, ఆర్భాటాలకు పోయి చేయరాదు. పూజలు, భజనలు, వీలైనంత వరకు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది.  అయ్యప్ప దీక్షతో మనము మన సన్నిధానములో ముందుగా గణపతి, సుబ్రమణ్య, మంజుమాత అమ్మవారితో పాటు ఇతర దేవతలను స్తుతించి తదుపరి స్వామివారిని పూజించి కీర్తనలు పాడుకుంటూ హారతి ఇవ్వడము మన సంప్రదాయము, మాల ధరించిన అయ్యప్ప స్వాములంతా సమానమే, గొప్పబీద అనే తారతమ్యం లేకుండా అహం బ్రహ్మస్మి తత్వమసి సిద్దాంతమునకు కట్టుబడి ఉండుట చాలా మంచిది.       ఓం శ్రీ స్వామియే శరణం.      

మరింత సమాచారం